Etela Rajender: అమిత్ షా సభ సక్సెస్ చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా తుక్కు గూడలో రేపు జరిగే అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రేపటి బహిరంగ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు బీజేపీ నేతలు. సీఎం కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. కుట్రతో, కుటిల నీతితో పాలన కొనసాగిస్తున్నారు. ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్ సంగ్రామ యాత్ర చేపట్టారన్నారు.
రేపు జరిగే సభను సక్సెస్ చేసి.. కేసీఆర్ చెంప ను చెల్లుమనిపిస్తాం అన్నారు. ప్రధాని అని కూడా చూడకుండా తూలనాడుతున్నారని, పిచ్చి లేచినట్టు మాట్లాడుతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పై,బీజేపీపై తప్పుడు ప్రచారం తండ్రి కొడుకుల ప్రభుత్వం చేస్తుందని, వారు విషం కక్కుతున్నారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ లో పెట్టినట్టుగా ఖర్చు చేయడం లేదు.
Also Read
- Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ - మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
- OTR : కవిత కొత్త పార్టీకి టిఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా.. పార్టీ పేరు మారుతుందా?
- Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
- OTR : గ్రేటర్ ఎన్నికలపై BJP టెన్షన్..? కాంగ్రెస్ వ్యూహాలపై కమలం అప్రమత్తం!
తెలంగాణ పూర్తి గా అభివృద్ధి చేసిన ఇక దేశాన్ని ఉద్దరించాలని పగటి కలలు కంటున్నారు…పగటి కలలకు ఖర్చు ఉండదు. ఆయన కుటుంబ పాలనను ప్రజల మీద రుద్దారు. ఈ రాష్ట్రం అంతా కల్వకుంట్ల గుప్పిట్లో ఉండాలని అనుకుంటున్నారు. కల్వకుంట్ల కుటుంబమ్ పైన తీవ్ర వ్యతిరేకత.. ఆ కుటుంబాన్ని ప్రజలు చిదరించుకుంటున్నరు. ఇంటింటికి డబ్బులు పంపించిన గ్రేటర్ లో గెలవలేక పోయారు. హుజూరబాద్ లో వేల కోట్లు ఖర్చు చేసి, దుర్మార్గపు పనులు చేసిన ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. రేపటి సభను భారీఎత్తున నిర్వహిస్తున్నాం.
స్పష్టమైన సందేశం అమిత్ షా ఇవ్వబోతున్నారు. కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని అమిత్ షా పిలుపు ఇవ్వబోతున్నారు. సంజయ్ యాత్రకు భారీ స్పందన వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.TRS ప్రభుత్వం రైతులకు మేమే అన్ని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నదని, వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాం…. రైతులకు వాస్తవాలు చెప్పాం. రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం తప్పేమీ లేదన్నారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!