Etela Rajender: అమిత్ షా సభ సక్సెస్ చేస్తాం
రంగారెడ్డి జిల్లా తుక్కు గూడలో రేపు జరిగే అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రేపటి బహిరంగ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు బీజేపీ నేతలు. సీఎం కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. కుట్రతో, కుటిల నీతితో పాలన కొనసాగిస్తున్నారు. ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్ సంగ్రామ యాత్ర చేపట్టారన్నారు.
రేపు జరిగే సభను సక్సెస్ చేసి.. కేసీఆర్ చెంప ను చెల్లుమనిపిస్తాం అన్నారు. ప్రధాని అని కూడా చూడకుండా తూలనాడుతున్నారని, పిచ్చి లేచినట్టు మాట్లాడుతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పై,బీజేపీపై తప్పుడు ప్రచారం తండ్రి కొడుకుల ప్రభుత్వం చేస్తుందని, వారు విషం కక్కుతున్నారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది. బడ్జెట్ లో పెట్టినట్టుగా ఖర్చు చేయడం లేదు.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
తెలంగాణ పూర్తి గా అభివృద్ధి చేసిన ఇక దేశాన్ని ఉద్దరించాలని పగటి కలలు కంటున్నారు…పగటి కలలకు ఖర్చు ఉండదు. ఆయన కుటుంబ పాలనను ప్రజల మీద రుద్దారు. ఈ రాష్ట్రం అంతా కల్వకుంట్ల గుప్పిట్లో ఉండాలని అనుకుంటున్నారు. కల్వకుంట్ల కుటుంబమ్ పైన తీవ్ర వ్యతిరేకత.. ఆ కుటుంబాన్ని ప్రజలు చిదరించుకుంటున్నరు. ఇంటింటికి డబ్బులు పంపించిన గ్రేటర్ లో గెలవలేక పోయారు. హుజూరబాద్ లో వేల కోట్లు ఖర్చు చేసి, దుర్మార్గపు పనులు చేసిన ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. రేపటి సభను భారీఎత్తున నిర్వహిస్తున్నాం.
స్పష్టమైన సందేశం అమిత్ షా ఇవ్వబోతున్నారు. కుటుంబ, అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని అమిత్ షా పిలుపు ఇవ్వబోతున్నారు. సంజయ్ యాత్రకు భారీ స్పందన వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.TRS ప్రభుత్వం రైతులకు మేమే అన్ని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నదని, వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాం…. రైతులకు వాస్తవాలు చెప్పాం. రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం తప్పేమీ లేదన్నారు కిషన్ రెడ్డి.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!