Etela Rajender : తెలంగాణ ప్రభుత్వం జనవరి 26ను జరపకపోవడం సిగ్గుచేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ అని ప్రపంచం మొత్తం దేశాన్ని కొనియాడుతుందని, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, దేశ ప్రజానికానికి స్పూర్తి నింపే రోజు జనవరి 26 అని, తెలంగాణ ప్రభుత్వం జనవరి 26ను జరపకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ కేసీఆర్ గవర్నర్ పట్ల వ్యవహరించిన తీరు జుగుప్సాకరం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గవర్నర్ పట్ల చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా సమాజం తలదించుకుంది. గవర్నర్ ను అవమాన పరచడం …రాజ్యాంగాన్ని, తెలంగాణ మహిళలను అవమనపరచడమే. కేసీఆర్ కి మొదటి నుంచి గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు.
Also Read : Suriya: ఆత్మను పోగొట్టుకున్న సూర్య.. ఎమోషనల్ ట్వీట్
Also Read
గవర్నర్ లను అనేక సార్లు కలిశారు… మొకరిల్లి వందనం చేసిన రోజులు కూడా వున్నాయి. కానీ తమిళిసై వచ్చాక గవర్నర్ ను అవమానిస్తున్నారు. ఫ్యూడల్ కుటుంబంలో పుట్టిన వ్యక్తిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఐదేళ్ల పాటు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపారు. ఒక ఎస్సి,ఒక బీసీ మహిళ లేకుండా అసెంబ్లీ నడుపుతున్న వ్యక్తి కేసీఆర్. సరూర్ నగర్ ఆర్ఫాన్ పాఠశాల లో 400 బాలికలకు ఒక్క టాయిలెట్ ఉంది. ఢిల్లీ వచ్చి హాస్పిటల్స్,స్కూల్స్ తిరిగి చూసి అవన్నీ తెలంగాణ లో అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ కి సిగ్గుండాలి. మహిళల పట్ల కేసీఆర్ చులకన భావంతో ఉన్నారు.’ అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
Also Read : Today (27-01-23) Stock Market Roundup: ‘అదానీ’ ఎఫెక్ట్.. 3 నెలల కనిష్టానికి మార్కెట్..
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!