Etela Rajender : తెలంగాణ ప్రజలు కేసీఆర్పై విసుగు చెంది బీజేపీ వైపు చూస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ లో చేరిన నిర్మల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలేటి మహేశ్వర్ రెడ్డి కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీనియర్ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్న మహేశ్వరం రెడ్డికి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ఎయిర్ పోర్ట్ లో ఘణంగా స్వాగతం పలికారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ…. తెలంగాణ ప్రజలు కెసిఆర్ పై విసుగు చెంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ లో చేరాలి ప్రజల అశయ సాదనలో మా వంతు కృషి చెయ్యాలని ఇతర పార్టీ నాయకులు బీజేపీ లో చేరుతున్నారని అన్నారు. కెసిఆర్ ఒంటెద్దు పోకడలకు అధికార పార్టీ నాయకులు విసుగు చెందారని త్వరలో ఆధికార పార్టీ నుండి చేరికలు ఉంటాయని అన్నారు.
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ….. కాంగ్రెస్ పార్టీని వీడి జెపి నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన నిర్మల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడంతో నిర్మల్, అదిలాబాద్ తో పాటు తెలంగాణలో నూతన ఉత్సాహం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులారా నిర్ణయం తీసుకొండి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తారా? మూడు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన నిజాయతికి మారుపేరు అభివృద్ధిలో దేశానికి మంచిపేరు తెస్తున్న నరేంద్రమోడీ నాయకత్వంలో పనిచేస్తారా ఆలోచించండి అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ మరి ఇతర పార్టీల నుండి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన నచ్చక అనేక మంది అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనది కాంగ్రెస్ రక్తం కాదు తెలుగు దేశం రక్తం అని అన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో కాంగ్రెస్ నుండి బీజేపీ లో చేరికలు ఉంటాయి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ….. కాంగ్రెస్ పార్టీని వీడి నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన నాకు ఇంతపెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా కలిసికట్టుగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..