Errabelli Dayakar Rao : కేంద్రం 100 అవార్డులు ఇస్తే 99 మన గ్రామాలకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా నాయనా కూడా 30 యేండ్లు సర్పంచ్ గా ఉన్నాడు. అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండే అందరికి తెలుసని అన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆనాడు నీళ్లకు ఎంత కష్టాలు ఉండే.. ఖాళీ బిందెలు ఎదురుగా వచ్చేవి మాకు గ్రామాల్లో అని ఆయన అన్నారు. సర్పంచ్ కు ఆనాడు మోటర్ కాలి పోయిందని, పైప్ లు పగిలాయని చెప్పేది. సీఎం కేసీఆర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకోని ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీరు ఇస్తున్నారు. ఇప్పుడు త్రాగు నీరు సమస్యలు ఎక్కడ లేవు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఇచ్చారు, వైకుంఠదామాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో చెత్తచెదరాంతో గ్రామాల్లో పెంట కుప్పలుగా ఉండేవి. ఇప్పుడు అలా ఎక్కడ కూడా లేదు. చిన్న గ్రామానికి కూడా ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. 99 శాతం ఉపాధి హామీ పథకంలో హరితహారం చెట్లకు నీళ్లు పోశారు. డబ్బులు సంపాదించారు వాటితో ట్రాక్టర్ కిస్తులు కట్టారు. గతంలో ఎవరు చేయని పనులు గ్రామాల్లో మీరు సర్పంచ్ లుగా ఉన్నప్పుడు అయ్యాయి. 15 ఆర్ధిక సంఘం నిధులు రాకుండా ఆపేసింది కేంద్ర ప్రభుత్వం.
Also Read : Mohan Bhagwat: భారత్ నుంచి ఎందుకు విడిపోయామా అని పాకిస్తాన్ ప్రజలు బాధపడుతున్నారు.
Also Read
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసింది. గ్రామాల అభివృద్ధికి ఆటంకాలు కలుగేందుకు. కేంద్ర ప్రభుత్వంకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నిధులు వాడుకుంటుంది తప్ప తెలంగాణ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1430 కోట్లు మాత్రమే. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవార్డులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు ఇవ్వడం లేదు. ఆనాడు వంద అవార్డులు ఇస్తే ఒక్కటి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు 100 ఇస్తే 99 మన రాష్ట్రంలోని గ్రామాలకు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకంను వ్యవసాయరంగంకు అనుసంధానం చేయాలని సీఎం డిమాండ్ చేసిన అనుసంధానం చేయడం లేదు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అధికారులు పొగుడుతారు. కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిధులు ఇవ్వరు. రైతులు కల్లాలు కడితే కట్టవద్దు అంటున్నారు. అదే వాళ్ళ రాష్ట్రాల్లో చేపలకు కల్లాలు కడుతున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం లెక్క. పశ్చిమ బెంగాల్ తో పాటు 5,6 రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంను ఆపేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆపాలని చూస్తున్నారు. ఉపాధి హామీ పథకంకు అనేక కొర్రీలు పెడుతున్నారు. సర్పంచ్ లకు జీతాలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి. మళ్ళీ సీఎం కేసీఆర్ సర్పంచ్ ల జీతాలపై తీపి కబురు ఇస్తాడు.’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Also Read : GT vs CSK : గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 179.. రుతురాజ్ సెంచరీ మిస్
తాజావార్తలు
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!