ENG W vs IND W: ఇన్నాళ్లకు.. ఎట్టకేలకు.. ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ కైవసం చేసుకున్న భారత్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENG W vs IND W: ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 2012 నుంచి ఇంగ్లాండ్లో టీ20 సిరీస్లు ఆడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరీస్ను గెలవలేకపోయిన భారత్ ఈసారి విజయం సాధించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన నాల్గో టీ20లో టీమిండియా ఘన విజయం నమోదు చేయడంతో.. మరో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
Read Also:Phone tapping case: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు..!
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
జులై 9 (బుధవారం)న మాంచెస్టర్లో జరిగిన నాల్గో టీ20లో భారత్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళల జట్టు 20 ఓవర్లలో 7 ఓవర్లలో 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో సాఫియా డంక్లే (22), టామీ బోమాంట్ (20), అమీ జోన్స్ (9) సహా మిగతా బ్యాటర్లు భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కించుకుంది. శ్రీఛరణి కూడా 2 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేసింది.
ఇక 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు సమిష్టిగా ఆడి 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇక భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధాన (32), షఫాలీ వర్మ (31) మంచి ఇన్నింగ్స్ ఆరంభం ఇచ్చారు. మధ్యలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (26), జెమీమా రోడ్రిగ్స్ (24 నాటౌట్) అద్భుతంగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించారు. రాధ యాదవ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ లభించగా, షఫాలీ వర్మకు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు దక్కింది.
Read Also:AP Liquor Case: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. రిటైర్డ్ ఐఏఎస్కు సిట్ నోటీసులు
ఈ విజయంతో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్లో తొలిసారి టీ20 సిరీస్ను గెలిచిన ఘనతను సాధించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన నాలుగు సిరీస్లలో మూడు సార్లు ఇంగ్లాండ్ గెలవగా, ఈసారి భారత్ జెండా ఎగరేసింది. ఇక నామమాత్రపు చివరి టీ20 మ్యాచ్ జులై 12న జరగనుంది.
Win the match ✅
Win the series ✅Jemimah Rodrigues and Richa Ghosh take #TeamIndia over the line 💪
Scoreboard ▶️ https://t.co/QF3qAMduOx#ENGvIND | @JemiRodrigues | @13richaghosh pic.twitter.com/f2KHmllSdj
— BCCI Women (@BCCIWomen) July 9, 2025
తాజావార్తలు
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!