BRS Formation Day : గులాబీమయమైన ఎల్కతుర్తి గ్రామం
- ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ ఏర్పాట్లు
- భద్రత కోసం భారీ బందోబస్తు.. పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు
- సభ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Formation Day : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామం ఈరోజు గులాబీ వాతావరణంలో నిండిపోయింది. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సభ కోసం మొత్తం 1213 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టగా, ఇందులో 159 ఎకరాల్లో సభాప్రాంగణాన్ని, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ నగరం నుండి ఎల్కతుర్తి వరకు గులాబీమయం అయింది.
సభ వేదిక 500 మంది కూర్చునేలా బాహుబలి స్థాయిలో రూపొందించగా, విద్యుత్ అంతరాయం రాకుండా 200 భారీ జనరేటర్లు సిద్ధం చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటు 10 లక్షల వాటర్ బాటిళ్లు సభకు హాజరయ్యే వారికి అందించనున్నారు. ఇప్పటికే నిన్నటినుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటో ర్యాలీలు, ఎడ్లబండ్ల ర్యాలీల రూపంలో ప్రజలు భారీగా ఎల్కతుర్తికి తరలివచ్చారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
బీఆర్ఎస్ సభ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరీంనగర్ నుంచి హనుమకొండ వైపు వచ్చే వాహనాలు పరకాల క్రాస్ రోడ్, కమలాపూర్ మీదుగా ఓఆర్ఆర్ రూట్ ఉపయోగించాలి. అలాగే హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ముచ్చర్ల క్రాస్ నూతన ఓఆర్ఆర్ రోడ్, కమలాపూర్, పరకాల క్రాస్ రోడ్ రూట్లను అనుసరించాలి.
సిద్దిపేట నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు జనగామ, తరిగొప్పుల మీదుగా రూట్ తీసుకోవాలని పోలీసులు సూచించారు. సూచించిన మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు. సభకు హాజరయ్యే వేలాది మందిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1100 మంది పైగా సిబ్బంది భద్రత కోసం విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 28 మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, 711 మంది కానిస్టేబుళ్లు భాగమయ్యారు. పూర్తి భద్రత చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యం కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. సభ విజయవంతం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!