Elon Musk: చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్.. ఎందుకోసమంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. తన భారత పర్యటనను వాయిదా వేసుకుని చైనాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఇండియాలో పర్యటించాల్సింది ఉంది.. కానీ ఆదివారం అకస్మాత్తుగా చైనాను సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాల పరంగా చైనా రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.. వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మస్క్ పర్యటనకు సంబంధించిన విషయాలు తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు.
CM YS Jagan: పేదలకు మేలు చేశానని అనిపిస్తేనే ఓటు వేయండి..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఎలోన్ మస్క్ తన ఇండియా పర్యటన వాయిదా పడిన వారం రోజుల తర్వాత చైనా పర్యటనకు వెళ్లారని చెప్పారు. ఇండియాలో అతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకుని, భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించవలసి ఉందన్నారు. చైనాలో టెస్లా (Tesla) కార్లకు ఇటీవల గిరాకీ తగ్గింది. పోటీ సంస్థల నుంచి అందుబాటు ధరలో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఇటీవల టెస్లా తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించింది. ఈ తరుణంలో మస్క్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) సాఫ్ట్వేర్, దేశం యొక్క ఆటోమేటెడ్ డ్రైవింగ్ సాంకేతికత కోసం అల్గారిథమ్లను రూపొందించడం గురించి చర్చించడానికి ఎలోన్ మస్క్ చైనాను సందర్శించినట్లు ఈ విషయంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేయడానికి ఆమోదం పొందేందుకు బీజింగ్లో చైనా సీనియర్ అధికారులతో మస్క్ సమావేశమయ్యారని పేర్కొన్నారు.
GT vs RCB: గుజరాత్ ను ఆదుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్.. బెంగళూరు టార్గెట్ 201..
ముఖ్యంగా, మస్క్ చైనా పర్యటన ప్రజల దృష్టిలో ప్రముఖంగా కనిపించలేదు. రాయిటర్స్ ప్రకారం, టెస్లా తన చైనీస్ అనుబంధ సంస్థ ద్వారా సేకరించిన మొత్తం డేటాను 2021 నుండి షాంఘైలో చైనీస్ రెగ్యులేటర్లకు అవసరమైన విధంగా నిల్వ చేసింది. చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో టెస్లా మొత్తం డేటాను అక్కడే స్టోర్ చేస్తోంది. ‘ఎఫ్ఎస్డీ’ని ట్రైన్ చేయడం కోసం ఆ డేటా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించనున్నట్లు సమాచారం. త్వరలో ఎఫ్ఎస్డీని చైనాలో అందుబాటులోకి తీసుకొస్తామని మస్క్ ఇటీవల స్వయంగా తెలిపారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!