Elon Musk: షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ఇక ఫ్రీ కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను సొంతం చేసుకున్న తర్వాత టెస్లా చీఫ్, ప్రముఖ వ్యాపార్త వేత్త ఎలాన్ మస్క్.. ట్విట్టర్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.. ట్విట్టర్ను కాస్తా ఎక్స్ గా మార్చి.. పిట్టె స్థానంలో ఎక్స్ సింబల్ ఏర్పాటు చేశారు.. ఆ తర్వాత బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ప్రవేశపెట్టబడింది. అంతకు ముందు వెరిఫైడ్ అకౌంట్లను పొందే బ్లూ టిక్ను పెయిడ్ సర్వీస్గా మార్చారు. ప్రకటనలపై వచ్చే రాబడి ధృవీకరించబడిన ఖాతాలకు జమ చేయబడుతుంది. అయితే, తాజాగా మరో కీలక మార్పు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎక్స్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ నెలవారీ రుసుము చెల్లించవలసి ఉంటుందని మస్క్ పేర్కనడం ఇప్పుడు సంచలనంగా మారింది.. బాట్లు, ఫేక్ అకౌంట్ల సమస్యను అధిగమించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీజు ఎంత? ఫీజు చెల్లించిన వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది దానిపై క్లారిటీ ఇవ్వలేదు మస్క్.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చల సందర్భంగా మస్క్.. ఎక్స్ వివరాలను వెల్లడించారు. ఎక్స్ ఇప్పుడు 550 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది, ప్రతిరోజూ 100 మరియు 200 మిలియన్ల మంది పోస్టింగ్ చేస్తున్నారని పేర్కొన్నాడు. అయితే ఈ వినియోగదారులలో ఎంత మంది నిజమైన వినియోగదారులు ఉన్నారు? మస్క్ ఎన్ని బోట్ ఖాతాలు ఉన్నాయో పేర్కొనలేదు. కృత్రిమ మేధస్సు, అధునాతన సాంకేతికత వల్ల కలిగే ప్రమాదాలు మరియు వాటి నివారణపై నెతన్యాహుతో మస్క్ చర్చించారు.
Also Read
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
ఇక, ట్విట్టర్ను 44 బిలియన్ డార్లకు ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత.. ఆ ప్లాట్ఫారమ్లో గణనీయమైన మార్పులు చేశాడు. గతంలో నిషేధించబడిన ఖాతాలను తిరిగి రావడానికి అతను అనుమతించాడు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి ఖాతాలు పునరుద్ధరించబడ్డాయి. ప్రముఖ వ్యక్తుల ఖాతాలను గుర్తించే బ్లూ టిక్ తొలగించబడింది. ప్రస్తుతం ఎవరైనా సబ్స్క్రయిబ్ చేసుకుంటే వారి పేరు పక్కన నీలిరంగు బ్యాడ్జ్ ఉంటుంది. వారి పోస్ట్లు ఎక్కువ మందికి కనిపిస్తాయి. సబ్స్క్రిప్షన్ తీసుకోని వారి పోస్టుల రీచ్ తక్కువగా ఉంటుంది. ఈ మార్పులు ఎక్స్ ప్లాట్ఫారమ్లో బాట్ల వినియోగాన్ని తగ్గిస్తాయని మస్క్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎక్స్ యునైటెడ్ స్టేట్స్లో మనీ ట్రాన్స్మిటర్ కావడానికి లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసింది. పబ్లిక్ రికార్డుల ప్రకారం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అనుమతులు జారీ చేయబడ్డాయి. అయితే, ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితంగా లభిస్తుండగా.. వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొనడం సంచలనంగా మారింది.. ఇప్పటికే ఎక్స్కు పోటీగా కొన్ని ప్లాట్ఫారమ్లో అందుబాటులోకి రాగా.. మస్క్ నిర్ణయంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!