Lok Sabha Elections 2024 : టీ, సమోసాల నుంచి అభ్యర్థుల అన్ని ఖర్చులపై కన్నేసిన ఎలక్షన్ కమిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024 : దేశంలో లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించబడ్డాయి. మొదటి ఓటింగ్ ఏప్రిల్ 19న, ఎన్నికల ఫలితాలు జూన్ 4న ప్రకటించబడతాయి. కాగా, ఎన్నికల ఖర్చులను నియంత్రించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మేజిస్ట్రేట్లతో పాటు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓలు) ఏరియాను బట్టి అభ్యర్థుల ఖర్చులను నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సీఈవోలందరూ ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. నీళ్ల నుంచి పటాకుల వరకు, టీ నుంచి పబ్లిసిటీ వరకు ఖర్చుపై పరిమితి విషయంలో అభ్యర్థులు నిబంధనలు పాటించగలరా లేదా అనేది చూడాలన్నారు. అలాగే కమిషన్ ముందు ఎన్ని ఉల్లంఘన కేసులు వస్తున్నాయో పరిశీలించాలని ఆదేశించారు.
వస్తువుల ధర జాబితా
దీంతో అభ్యర్థులు ప్రతి పైసా బిల్లును, లెక్కను ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది. కమిషన్ సూచనల మేరకు జిల్లా స్థాయిలో అభ్యర్థులకు వస్తువుల ధరల జాబితాను విడుదల చేశారు. ఇందులో అభ్యర్థుల ఖర్చు రేట్లను కూడా ఖరారు చేశారు. ఈసారి యూపీలో టీ, సమోసా ధర రూ.10గా నిర్ణయించగా, జిలేబీ ధర కిలో రూ.150గా ఉంచారు. సింగిల్ నాన్ ఏసీ గది ధర రూ.1150, డబుల్ బెడ్ రూ.1550గా నిర్ణయించారు. దీంతో పాటు రెండు లీటర్ల శీతల పానీయం బాటిల్ ధర రూ.90, శాఖాహారం ప్లేట్ రూ.80, నాన్ వెజిటేరియన్ ప్లేట్ ధర రూ.200గా ఉంచారు. అరలీటర్ వాటర్ బాటిల్ ధర రూ.10, లీటర్ రూ.20, రెండు లీటర్ రూ.30గా నిర్ణయించారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ప్రమోషన్ రేట్లు కూడా
ఇండికా, వ్యాగన్ఆర్, టాటా సుమో, మారుతీ జిప్సీ నాన్ఏసీ ధరలను రోజుకు రూ.1100గా ఉంచగా, ఈ ఏసీ వాహనాలకు రోజుకు రూ.1210గా ఉంచారు. స్కార్పియో, టవేరా, ఇన్నోవా, బొలెరో నాన్ ఏసీ ధర రూ.1294గా, ఏసీ వాహనాలకు రోజుకు రూ.1815గా నిర్ణయించారు. ఆయిల్ లేని ట్రాక్టర్ ట్రాలీకి రోజుకు రూ.484, ఆయిల్ లేకుండా మోటార్ సైకిల్ ద్వారా ప్రచారం చేసేందుకు రోజుకు రూ.400, సైకిల్ పై ప్రచారం చేసేందుకు రోజుకు రూ.100 చొప్పున ధర నిర్ణయించారు. ఎయిర్ కండీషనర్తో కూడిన సింగిల్ బెడ్ రూమ్ల ధర రూ.1650గా, డబుల్ బెడ్ రూమ్ల ధర రూ.1810గా నిర్ణయించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల వారీగా కమిషన్ పర్యటిస్తున్నప్పుడు ఈ రేట్లు నిర్ణయించారు. అనంతరం ప్రతి జిల్లాలో అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి నిర్ణయించిన జాబితాను కచ్చితంగా పాటించాలని సీఈవోలందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!