Eknath Shinde: ఏక్నాథ్ షిండే ఔదార్యం.. అనాథ పిల్లలను దత్తత తీసుకోనున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని ఇర్షల్వాడి గ్రామంలో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటంతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే దత్తత తీసుకోనున్నట్లు శివసేన తెలిపింది. “ఇర్షల్వాడిలో కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. ఈ పిల్లలను దత్తత తీసుకుని వారికి సంరక్షకులుగా మారాలని సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల ఈ అనాథ పిల్లలను శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ చూసుకుంటుందని సీఎం ప్రకటించారు” అని శివసేన పేర్కొంది.
“సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు నిర్వహించే శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ ద్వారా విద్య, ఇతర విషయాలకు సంబంధించిన అన్ని ఖర్చులు భరిస్తారని, ప్రతి పిల్లవాడికి వారి చదువుకు నిధులు సమకూర్చడానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడుతుందని సీఎం ఏక్నాథ్ షిండే ఓఎస్డీ మంగేష్ చివ్టే చెప్పారు. కాగా ఇర్షల్వాడి కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) శనివారం రాయ్గఢ్లోని కొండచరియలు విరిగిపడిన ఇర్షల్వాడి వద్ద తన శోధన, సహాయక చర్యలను కొనసాగించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉదయాన్నే ఘటనాస్థలికి చేరుకుంది. ఈ రోజు తర్వాత మరిన్ని బృందాలు సెర్చ్ ఆపరేషన్లో చేరే అవకాశం ఉంది.
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
Also Read: Mohan Bhagwat : శ్రీవాణి ట్రస్ట్పై ప్రశంసలు కురిపించిన ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్
బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ముంబైకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని రాయగడ జిల్లా ఖలాపూర్ తహసీల్లోని కొండ వాలుపై ఉన్న గిరిజన గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారం ప్రమాద స్థలాన్ని సందర్శించి, సహాయ చర్యలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా ఆయన ప్రకటించారు. ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రి షిండేతో మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడానికి నాలుగు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను మోహరించినట్లు అమిత్ షా చెప్పారు.
తాజావార్తలు
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!