Terrorists Arrest: దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర.. తిప్పికొట్టిన పోలీసులు
- ఉగ్రవాదుల భారీ కుట్ర
- 'చికెన్ నెక్'పై దాడి ప్లాన్
- భగ్నం చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర భారీ కుట్ర పన్నిన ఓ గ్యాంగ్ని పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అరెస్టయిన అన్సార్-అల్-ఇస్లామ్ బంగ్లాదేశ్కు చెందిన ఎనిమిది మంది అనుమానిత సభ్యులను అరెస్ట్ చేశారు. వీళ్లు ‘చికెన్ నెక్’పై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు పోలీసు ఓ ఉన్నతాధికారి సమాచారం అందించారు. ‘చికెన్ నెక్’ అనేది పశ్చిమ బెంగాల్లోని సిలిగురిని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే కారిడార్. సిలిగురి కారిడార్లో వరుస దాడులు చేసి.. పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించాలన్నది వీళ్ల ప్లాన్.
READ MORE: Elon Musk: ‘‘చేతకాని దద్దమ్మ’’..టెర్రర్ అటాక్పై జర్మనీ ఛాన్సలర్ని తిట్టిన మస్క్..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
పశ్చిమ బెంగాల్ పోలీసులు ముర్షీదాబాద్ జిల్లాలో అరెస్టయిన ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు అనుమానితుల నుంచి పెన్ డ్రైవ్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్, కేరళ, అస్సాం పోలీసులు పట్టుకున్న ఎనిమిది మంది వ్యక్తుల బృందంలో వీరు కూడా ఉన్నారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) సుప్రతిమ్ సర్కార్ శుక్రవారం విలేకరులతో చెప్పారు. సిలిగురి కారిడార్ అని కూడా పిలువబడే ఏడు ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక మార్గమైన ‘చికెన్ నెక్’ అని తెలిపారు. ఆయా ప్రాంతాన్ని లక్ష్యం చేసుకునేందు తమ వద్ద నిర్దిష్ట ప్రణాళిక ఉందని విచారణలో తేలిందని చెప్పారు. ఆగస్టు నుంచి యాక్టివ్గా ఉన్న సంస్థకు చెందిన ‘స్లీపర్ సెల్’ గురించి రాష్ట్ర పోలీసులకు సమాచారం అందిందని ప్రభుత్వం తెలిపింది.
READ MORE: CM Revanth Reddy: అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలు..?
“అబ్బాస్ అలీ, మినారుల్ షేక్ అనే ఇద్దరు అనుమానితుల నుంచి 16 GB పెన్ డ్రైవ్, కొన్ని జిహాదీ పత్రాలు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నాం. వారు దక్షిణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న స్లీపర్ మాడ్యూల్లో భాగమైనట్లు అనుమానిస్తున్నాం. ఉత్తర బెంగాల్లోని సున్నితమైన ప్రాంతాలతో పాటు ఈశాన్య ఏడు రాష్ట్రాల్లో అస్థిరతను సృష్టించడం లక్ష్యంగా చేసుకున్నారు. వారు ముర్షీదాబాద్, అలీపుర్దూర్ జిల్లాలలో ఆశ్రయం పొందారు. వారు ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసుకున్నారు. ”అని సుప్రతిమ్ సర్కార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!