Terrorists Arrest: దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర.. తిప్పికొట్టిన పోలీసులు
- ఉగ్రవాదుల భారీ కుట్ర
- 'చికెన్ నెక్'పై దాడి ప్లాన్
- భగ్నం చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర భారీ కుట్ర పన్నిన ఓ గ్యాంగ్ని పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అరెస్టయిన అన్సార్-అల్-ఇస్లామ్ బంగ్లాదేశ్కు చెందిన ఎనిమిది మంది అనుమానిత సభ్యులను అరెస్ట్ చేశారు. వీళ్లు ‘చికెన్ నెక్’పై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు పోలీసు ఓ ఉన్నతాధికారి సమాచారం అందించారు. ‘చికెన్ నెక్’ అనేది పశ్చిమ బెంగాల్లోని సిలిగురిని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే కారిడార్. సిలిగురి కారిడార్లో వరుస దాడులు చేసి.. పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించాలన్నది వీళ్ల ప్లాన్.
READ MORE: Elon Musk: ‘‘చేతకాని దద్దమ్మ’’..టెర్రర్ అటాక్పై జర్మనీ ఛాన్సలర్ని తిట్టిన మస్క్..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
పశ్చిమ బెంగాల్ పోలీసులు ముర్షీదాబాద్ జిల్లాలో అరెస్టయిన ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు అనుమానితుల నుంచి పెన్ డ్రైవ్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్, కేరళ, అస్సాం పోలీసులు పట్టుకున్న ఎనిమిది మంది వ్యక్తుల బృందంలో వీరు కూడా ఉన్నారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) సుప్రతిమ్ సర్కార్ శుక్రవారం విలేకరులతో చెప్పారు. సిలిగురి కారిడార్ అని కూడా పిలువబడే ఏడు ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక మార్గమైన ‘చికెన్ నెక్’ అని తెలిపారు. ఆయా ప్రాంతాన్ని లక్ష్యం చేసుకునేందు తమ వద్ద నిర్దిష్ట ప్రణాళిక ఉందని విచారణలో తేలిందని చెప్పారు. ఆగస్టు నుంచి యాక్టివ్గా ఉన్న సంస్థకు చెందిన ‘స్లీపర్ సెల్’ గురించి రాష్ట్ర పోలీసులకు సమాచారం అందిందని ప్రభుత్వం తెలిపింది.
READ MORE: CM Revanth Reddy: అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలు..?
“అబ్బాస్ అలీ, మినారుల్ షేక్ అనే ఇద్దరు అనుమానితుల నుంచి 16 GB పెన్ డ్రైవ్, కొన్ని జిహాదీ పత్రాలు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నాం. వారు దక్షిణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న స్లీపర్ మాడ్యూల్లో భాగమైనట్లు అనుమానిస్తున్నాం. ఉత్తర బెంగాల్లోని సున్నితమైన ప్రాంతాలతో పాటు ఈశాన్య ఏడు రాష్ట్రాల్లో అస్థిరతను సృష్టించడం లక్ష్యంగా చేసుకున్నారు. వారు ముర్షీదాబాద్, అలీపుర్దూర్ జిల్లాలలో ఆశ్రయం పొందారు. వారు ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసుకున్నారు. ”అని సుప్రతిమ్ సర్కార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!