CM Revanth Reddy: అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలు..?
- సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో స్పందించిన సీఎం రేవంత్రెడ్డి
- ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు
- ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు-సీఎం రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ అంశం మీద సంచలన విషయాలు బయట పెట్టారు. ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్లోకి హీరో వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని ఒక్కటే దారి ఉంది కాబట్టి హీరో హీరోయిన్ రావద్దని చెప్పామని అన్నారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే సరిపోయేది కానీ రోడ్ షో చేసుకుంటూ వచ్చాడని దానికి కారణంగా వేలాదిమంది వచ్చారని అన్నారు. ఆ కారణంగానే రేవతి ఒకపక్క ఆమె కుమారుడు ఒక పక్కకు వెళ్లిపోయారని వేలాదిమంది రాక కారణంగా తొక్కిసలాట జరిగి కన్న బిడ్డను పట్టుకునే ప్రయత్నంలో రేవతి చనిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. రేవతి కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడని ఆయన అన్నారు.
Odela 2 : ‘ఓదెల 2’ నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ఈ ఘటన జరిగిన సమయంలో హీరో హాల్లోనే ఉన్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. థియేటర్ వాళ్ళు కూడా పోలీసులు కంట్రోల్ చేయకుండా చేశారని పోలీసులను కూడా హీరోకు విషయం చెప్పడానికి వెళ్తే పోనివ్వలేదు అన్నారు. ఏసీబీకి కోపం వచ్చి అందరినీ లోపల వేస్తానంటే అప్పుడు లోపలికి పంపారని అన్నారు అప్పుడు పోలీసులు వెళ్లి సినిమా హీరోని థియేటర్ నుంచి పంపించి వేశారని అన్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హీరో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేశారని ఆయన అన్నారు. అంతే కాదు విచారణ కోసం వెళితే పోలీసుల పట్ల హీరో దురుసుగా ప్రవర్తించారని ఆయన అన్నారు. హీరోని స్టేషన్ కి తీసుకువెళ్లాక కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఎంతో నీచంగా పోస్టులు పెట్టారని ఆయన అన్నారు.
రేవతి చనిపోతే 11 రోజుల వరకు ఎవరూ పరామర్శకు వెళ్లలేదు ఇదా మానవత్వం అంటూ ఆయన ప్రశ్నించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన నాపైన అడ్డగోలుగా ట్వీట్ చేశాడంటూ కేటీఆర్ మీద ఆయన ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు సినిమాలు తీయనీయలేదు అంటూ ఆయన విమర్శించారు. అంతేకాదు పుష్ప 2 సినిమాకు స్పెషల్ షో అనుమతి ఇచ్చింది నేనేనని సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఆ అనుమతి ఇచ్చామని అన్నారు. హీరో బయటకు వచ్చాక సినిమా వాళ్ళందరూ అతని ఇంటికి క్యూ కట్టారు కానీ తల్లి చనిపోయి ఆసుపత్రిలో కోమాలో ఉన్న వారిని సినీ ప్రముఖులు పరామర్శించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలు..? ఆస్పత్రిలో ఉన్న బాలుడిని మాత్రం ఎందుకు పట్టించుకోరు? రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!