Delimitation : డీలిమిటేషన్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా రేవంత్ రెడ్డి..
- పునర్విభజనతో నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణకు భారీ బహిరంగ సభ
- జాతీయ స్థాయిలో సమన్వయం..కార్యాచరణ అమలుకు ఢిల్లీలో కార్యాలయం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు సదస్సులో ఆమోదం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation : నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలతో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల హక్కులను కాపాడుకునే క్రమంలో రెండో సదస్సుకు హైదరాబాద్లో వేదిక కానుంది. పునర్విభజనకు సంబంధించి చెన్నైలో శనివారం నిర్వహించిన సదస్సు ఈ మేరకు తీర్మానించింది. సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునర్విభజనతో నష్టపోనున్న రాష్ట్రాల ప్రజల అభిమతానికి అనుగుణంగా రెండో సదస్సును హైదరాబాద్లో నిర్వహిస్తామని, అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సదస్సులో పాల్గొన్నవారంతా మద్దతు తెలపడంతో పునర్విభజన సదస్సు, సభకు హైదరాబాద్ వేదికగా మారనుంది. పునర్విభజనపై దక్షిణాదితో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల గళాన్ని బలంగా వినిపించేందుకు ఆయా రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ఎంపీలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే అన్ని రాజకీయ పరమైన నిర్ణయాలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో అక్కడ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ..పరస్పరం సమన్వయం చేసుకుంటూ.. భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ఎంపీలతో కూడిన కమిటీ పని చేయాలని, ఇందుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రులు, నాయకులు అంగీకరించడంతో ఢిల్లీలో ఆ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చరిత్ర.. వర్తమాన పరిస్థితులతో పాటు జనాభా దామాషా, ప్రొరేట్ ప్రకారం పునర్విభజన జరిపితే దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, ఒడిశా నష్టపోయే తీరును సీఎం రేవంత్ రెడ్డి వివరించడంతో సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ శ్రద్దగా విన్నారు. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినా లోక్సభ సీట్లు పెంచకుండా శాసనసభ సీట్లు పెంచుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పించాలని సీఎం సూచించడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. మహిళలకు 33 శాతం సీట్లు, ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపుపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలు చాలా అర్ధవంతంగా ఉన్నాయని సదస్సులో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Cricket Legends: నాతో సెల్ఫీ కావాలా? ఆటోగ్రాఫ్ కావాలా?.. కపిల్, ధోనికి రోహిత్ ఫన్నీ ఆఫర్..
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!