Minister Botsa: వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది.. నువ్వో లెక్కా….?
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల హీట్ ఇప్పుడే కనిపిస్తుంది. అధికార ప్రతిపక్షాల మధ్య జోరుగా విమర్శలు కొనసాగుతున్నాయి. జనసేన,టీడీపీ, బీజేపీ పార్టీలు అధికార వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. విపక్ష నేతలకు అధికార పార్టీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచి అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ పట్నమే మునిగిపోయింది… చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీయే మునిగిపోయింది.. ఉత్తర భారత దేశంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరమే నీట మునిగిపోయింది.. ప్రత్యేక సందర్భంలో వచ్చే వర్షాలకు మునిపోవడం సహజం.. ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో మునిగిపోక తప్పదని బొత్స అన్నారు.
Read Also: Teacher Suspended: విద్యార్థులతో క్లాస్రూమ్లో మసాజ్ చేయించుకున్న టీచర్ సస్పెండ్
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
- Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
రాష్ట్రంలో ఇస్తున్న అమ్మ ఒడి కార్యక్రమాలకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కాకపోతే సినిమా యాక్టర్లు వస్తారా అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్సనారాయణ ప్రశ్నించారు. తల్లిదండ్రులు రావాడం తప్పని నేను అనుకోవడం లేదు.. కోర్టు దీనిపై సూచనలిస్తే వాటిని పాటిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్దిపై చంద్రబాబు ఏం మాట్లాడుతాడు.. ఒక్కసారి చంద్రబాబుని విజయనగరం వచ్చి చూడమనండి.. కుప్పం కంటే మా జిల్లా ఎంత బాగుంటుందో అప్పుడు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖకు వస్తుంది అని మంత్రి బొత్స సత్సనారాయణ అన్నారు.
Read Also: Double Ismart : సినిమాలో కీలక పాత్ర చేయబోతున్న ఆ బాలీవుడ్ నటుడు..?
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని మంత్రి బొత్స సత్సనారాయణ ప్రశ్నించారు. ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తుంటే టీడీపీ ఓర్చుకోలేకపోతుందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స అన్నారు.
తాజావార్తలు
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో