Bombay High Court: విద్యపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యపై ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, కానీ ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. నాణ్యమైన విద్య అందరికీ అందేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని తెలిపింది.
పుణెలో విద్యాసంస్థల ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని కొట్టివేయలేమని న్యాయమూర్తులు ఏఎస్ చందూర్కర్, జితేంద్ర జైన్లతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. హైకోర్టు ఫిబ్రవరి 21న ఇచ్చిన ఉత్తర్వుల్లో విద్యావిధాన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని, ఉత్తమమైన విద్యాసంస్థలను ఎంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుందని వ్యాఖ్యానించింది.
Also Read
పవిత్రమైన విద్యను రానురాను అభ్యసించలేనిదిగా మారిందని విచారం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ నాణ్యమైన విద్య అందించేలా చూడడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా ధర్మాసనం అభివర్ణించింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..