Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Education Free Tablets Students Uttar Pradesh Digishakti Scheme

Free Tablet Scheme: విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా!

Published Date :January 4, 2026 , 7:08 pm
By Shiva Ganesh
Free Tablet Scheme: విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Free Tablet Scheme: విద్యార్థులను ఉచితంగా టాబ్లెట్లు అందజేస్తున్నారు. మీకు తెలుసా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి కొత్త పథకాలను అమలు చేస్తోంది. చిన్నారులను చదువుతో పాటు సాంకేతికతతో అనుసంధానించడం నేటి కాలంలో కీలకమైన అవసరంగా మారింది. దీనికి అనుగుణంగా, యూపీ సర్కార్ విద్యార్థులకు ఉచిత టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను అందించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇంతకీ ఆ పథకం ఏంటి, దాని స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

READ ALSO: MG Windsor EV: 2025 లో ఎలక్ట్రిక్ కింగ్‌గా నిలిచిన ఎంజీ విండ్సర్ EV.. మిడిల్ క్లాస్ కి బెస్ట్ ఆప్షన్..

యూపీ సర్కార్ ఈ పథకం ద్వారా యువతను ఆన్‌లైన్ విద్య, డిజిటల్ నైపుణ్యాలు, కొత్త ఉపాధి అవకాశాలతో అనుసంధానించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డిజిశక్తి పథకాన్ని స్టార్ చేసింది. డిజిటల్ ఇండియా మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడం, రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఈ పథకంలో భాగంగా, సాంకేతిక, వైద్య, నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, విశ్వవిద్యాలయాలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు అందించనున్నారు.

ఈ పథకంలో 6.8 మిలియన్లకు పైగా విద్యార్థులను అనుసంధానించాలని యూపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ప్రయోజనం పొందుతారని అధికారులు వెల్లడించారు. ఈ టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులను సులభంగా యాక్సెస్ చేయగలరు. అలాగే ఇ-లెర్నింగ్ కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు, డిజిటల్ నోట్స్ తీసుకోగలరు, పోటీ పరీక్షలకు సిద్ధం కాగలరు. వీటి ద్వారా విద్యార్థులు కొత్త సాంకేతికతలు, డిజిటల్ నైపుణ్యాలను కూడా నేర్చుకోగలుగుతారు, ఇది వారి భవిష్యత్తు ఉపాధి అవకాశాలను పెంచుతుందని అధికారులు తెలిపారు.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
డిజిశక్తి పథకానికి విద్యార్థులు విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రక్రియ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ద్వారా నిర్వహించనున్నారు. అనంతరం సంబంధిత సంస్థలు అర్హత కలిగిన విద్యార్థుల డేటాను డిజిశక్తి పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తాయి. ఈ డేటా ధృవీకరించిన తర్వాత, విద్యార్థులు digishakti.up.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, e-KYCని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ విద్యార్థి డేటా అయిన తప్పుగా ఉంటే, వారు తమ కళాశాల నోడల్ అధికారిని సంప్రదించవచ్చు. మొత్తం ప్రక్రియలో విద్యార్థులు లాగిన్ IDని సృష్టించాల్సిన అవసరం లేదు. విద్యార్థులు తమ టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ స్థితికి సంబంధించిన సమాచారాన్ని SMS ద్వారా అందుకుంటారు. ఈ విధంగా డిజిశక్తి పథకం ఉత్తరప్రదేశ్‌లోని విద్యార్థులను డిజిటల్‌గా శక్తివంతం చేస్తోందని, విద్య, కెరీర్ అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Mana Shankara Vara Prasad Garu Trailer: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ చూశారా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DigiShakti portal eKYC
  • DigiShakti scheme Uttar Pradesh
  • digital education scheme UP
  • free smartphones for students
  • free tablets for students UP

తాజావార్తలు

  • Noida Violence: నోయిడా హింసాకాండ వెనక పాకిస్తాన్ ఎక్స్ అకౌంట్లు..

  • LIC HFL 2026: గ్రాడ్యుయేట్లకు అద్భుత అవకాశం.. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్.. ఎలిజిబిలిటీ, శాలరీ వివరాలు

  • LIC: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే..

  • Doctor Doom of Kanpur : 12వ తరగతి చదివి.. వందకు పైగా కిడ్నీ ఆపరేషన్లు చేసిన కిలాడీ నకిలీ డాక్టర్.!

  • MI vs PBKS: ముంబైతో పంజాబ్ ఢీ.. ఫిట్‌నెస్ సమస్యతో రోహిత్ అవుట్..!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions