Kejriwal: మెడికల్ టెస్టుల కోసం కేజ్రీవాల్ పిటిషన్.. కోర్టు స్పందన ఇదే!
- మెడికల్ టెస్టుల కోసం కేజ్రీవాల్ పిటిషన్
- వీడియో కాన్ఫరెన్స్లో భార్య ఉండాలని అభ్యర్థన
- అభ్యంతరం లేదన్న రౌస్ అవెన్యూ కోర్టు
- శనివారం తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం
తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మెడికల్ పరీక్షల కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనతో చేరేందుకు తన భార్యను అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు. శుక్రవారం విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు.. దీనిపై అభ్యంతరం లేదని పేర్కొంది. కేజ్రీవాల్ దరఖాస్తుపై న్యాయమూర్తి ముఖేష్ కుమార్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి దరఖాస్తుపై స్పందించాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది జోహెబ్ హొస్సేన్ స్పందిస్తూ ముఖ్యమంత్రి దరఖాస్తుపై స్పందించడానికి మరింత సమయం అవసరమని కోర్టుకు తెలిపారు. శనివారం దీనిపై ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది.
ఇది కూడా చదవండి: Vegetable Prices: వామ్మో ఇవేం ధరలు బాబోయ్!.. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కేజ్రీవాల్ను తీహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు. బ్లడ్ షుగర్ను పెంచడానికి ఉద్దేశపూర్వకంగా స్వీట్లు మరియు మామిడి పండ్లు తింటున్నారని.. బెయిల్ కోసం ఇదంతా చేస్తు్న్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది . మరోవైపు, కేజ్రీవాల్కు మధుమేహానికి ఇన్సులిన్ మరియు ఇతర మందులు ఇవ్వకుండా జైలులో చంపడానికి కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. మొత్తానికి కోర్టు ఆదేశాల తర్వాత ఏప్రిల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డుకు తన ఆరోగ్యంపై ఇన్పుట్లను అందించడానికి అనుమతించాలని అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలో తెలుసా?
ఇదిలా ఉంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికల కోసం సుప్రీంకోర్టు 21 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. అంతకముందు రెగ్యులర్ బెయిల్ కోసం, మెడికల్ పరీక్షల కోసం బెయిల్ పిటిషన్లు వేశారు. వాటిని కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన జైల్లో లొంగిపోయారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ జూన్ 19న విచారణకు రానుంది.
ఇది కూడా చదవండి: Prajavani: ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల వెల్లువ
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!