Kejriwal: మెడికల్ టెస్టుల కోసం కేజ్రీవాల్ పిటిషన్.. కోర్టు స్పందన ఇదే!
- మెడికల్ టెస్టుల కోసం కేజ్రీవాల్ పిటిషన్
- వీడియో కాన్ఫరెన్స్లో భార్య ఉండాలని అభ్యర్థన
- అభ్యంతరం లేదన్న రౌస్ అవెన్యూ కోర్టు
- శనివారం తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మెడికల్ పరీక్షల కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనతో చేరేందుకు తన భార్యను అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు. శుక్రవారం విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు.. దీనిపై అభ్యంతరం లేదని పేర్కొంది. కేజ్రీవాల్ దరఖాస్తుపై న్యాయమూర్తి ముఖేష్ కుమార్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి దరఖాస్తుపై స్పందించాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది జోహెబ్ హొస్సేన్ స్పందిస్తూ ముఖ్యమంత్రి దరఖాస్తుపై స్పందించడానికి మరింత సమయం అవసరమని కోర్టుకు తెలిపారు. శనివారం దీనిపై ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది.
ఇది కూడా చదవండి: Vegetable Prices: వామ్మో ఇవేం ధరలు బాబోయ్!.. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు
Also Read
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కేజ్రీవాల్ను తీహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు. బ్లడ్ షుగర్ను పెంచడానికి ఉద్దేశపూర్వకంగా స్వీట్లు మరియు మామిడి పండ్లు తింటున్నారని.. బెయిల్ కోసం ఇదంతా చేస్తు్న్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది . మరోవైపు, కేజ్రీవాల్కు మధుమేహానికి ఇన్సులిన్ మరియు ఇతర మందులు ఇవ్వకుండా జైలులో చంపడానికి కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. మొత్తానికి కోర్టు ఆదేశాల తర్వాత ఏప్రిల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డుకు తన ఆరోగ్యంపై ఇన్పుట్లను అందించడానికి అనుమతించాలని అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలో తెలుసా?
ఇదిలా ఉంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికల కోసం సుప్రీంకోర్టు 21 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. అంతకముందు రెగ్యులర్ బెయిల్ కోసం, మెడికల్ పరీక్షల కోసం బెయిల్ పిటిషన్లు వేశారు. వాటిని కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన జైల్లో లొంగిపోయారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ జూన్ 19న విచారణకు రానుంది.
ఇది కూడా చదవండి: Prajavani: ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల వెల్లువ
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?