Kejriwal: మెడికల్ టెస్టుల కోసం కేజ్రీవాల్ పిటిషన్.. కోర్టు స్పందన ఇదే!
- మెడికల్ టెస్టుల కోసం కేజ్రీవాల్ పిటిషన్
- వీడియో కాన్ఫరెన్స్లో భార్య ఉండాలని అభ్యర్థన
- అభ్యంతరం లేదన్న రౌస్ అవెన్యూ కోర్టు
- శనివారం తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మెడికల్ పరీక్షల కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనతో చేరేందుకు తన భార్యను అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు. శుక్రవారం విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు.. దీనిపై అభ్యంతరం లేదని పేర్కొంది. కేజ్రీవాల్ దరఖాస్తుపై న్యాయమూర్తి ముఖేష్ కుమార్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి దరఖాస్తుపై స్పందించాలని జైలు సూపరింటెండెంట్కు న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది జోహెబ్ హొస్సేన్ స్పందిస్తూ ముఖ్యమంత్రి దరఖాస్తుపై స్పందించడానికి మరింత సమయం అవసరమని కోర్టుకు తెలిపారు. శనివారం దీనిపై ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది.
ఇది కూడా చదవండి: Vegetable Prices: వామ్మో ఇవేం ధరలు బాబోయ్!.. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కేజ్రీవాల్ను తీహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్ మధుమేహ వ్యాధిగ్రస్తుడు. బ్లడ్ షుగర్ను పెంచడానికి ఉద్దేశపూర్వకంగా స్వీట్లు మరియు మామిడి పండ్లు తింటున్నారని.. బెయిల్ కోసం ఇదంతా చేస్తు్న్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది . మరోవైపు, కేజ్రీవాల్కు మధుమేహానికి ఇన్సులిన్ మరియు ఇతర మందులు ఇవ్వకుండా జైలులో చంపడానికి కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. మొత్తానికి కోర్టు ఆదేశాల తర్వాత ఏప్రిల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డుకు తన ఆరోగ్యంపై ఇన్పుట్లను అందించడానికి అనుమతించాలని అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలో తెలుసా?
ఇదిలా ఉంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికల కోసం సుప్రీంకోర్టు 21 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. అంతకముందు రెగ్యులర్ బెయిల్ కోసం, మెడికల్ పరీక్షల కోసం బెయిల్ పిటిషన్లు వేశారు. వాటిని కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన జైల్లో లొంగిపోయారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ జూన్ 19న విచారణకు రానుంది.
ఇది కూడా చదవండి: Prajavani: ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల వెల్లువ
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!