Delhi Excise Policy: మద్యం కుంభకోణంలో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో 38 మంది నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో అరవింద్ కేజ్రీవాల్ను 37వ నిందితుడిగా పేర్కొనగా, ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 38వ నిందితుడిగా ఉంది. 232 పేజీల ఛార్జ్ షీట్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. మద్యం వ్యాపారులతో కుమ్మక్కయి తమకు అనుకూలంగా పాలసీని తయారు చేసుకోవడం ద్వారా పార్టీ నేతలు లబ్ధి పొందుతారని పేర్కొంది. కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం వెనుక సిఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల లక్ష్యం లంచాలకు బదులుగా సౌత్ లాబీకి ప్రయోజనం చేకూర్చడమే. విచారణ ఆధారంగా విజయ్ నాయర్ పార్టీలో ఎటువంటి పదవిని నిర్వహించలేదని, అతను ఆప్ నాయకుల మధ్యవర్తి మాత్రమే అని చార్జ్ షీట్లో ఈడీ పేర్కొంది.
Read Also:Kurnool: ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు..
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఆప్ నేతలు లంచం తీసుకునేందుకు మార్గం సుగమం అయ్యేలా మద్యం వ్యాపారులతో కుమ్మక్కై తమకు అనుకూలంగా పాలసీని తయారు చేసుకోవడమే విజయ్ నాయర్ పని అని చార్జిషీట్ పేర్కొంది. 17 నవంబర్ 2022న ఇచ్చిన తన ప్రకటనలో.. తాను ఢిల్లీ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ పదవిని కలిగి లేనప్పటికీ, మార్చి 2021 నుండి కొత్త మద్యం పాలసీకి సంబంధించి మద్యం వ్యాపారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు విజయ్ నాయర్ తెలిపారు. మరుసటి రోజు నవంబర్ 18న ఇడి విచారణ సందర్భంగా విజయ్ నాయర్ తాను సిఎం నివాసానికి సమీపంలోని ప్రభుత్వ బంగ్లాలో నివసిస్తున్నట్లు చెప్పాడు. ఈ బంగ్లాను ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కైలాష్ గెహ్లాట్కు కేటాయించారు. అంతేకాకుండా, విజయ్ నాయర్ సిఎం క్యాంపు కార్యాలయం నుండి పనిచేస్తున్నట్లు కూడా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. నాయర్ ఎప్పుడూ ఏ ఎమ్మెల్యేను కలవలేదు.. ఆయన నేరుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతిషిలకు రిపోర్ట్ చేసేవారు. ఈ ఏడాది ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కైలాష్ గెహ్లాట్ వాంగ్మూలాన్ని కూడా ఈడీ రికార్డ్ చేసింది, అందులో నాయర్కు నేను నా ప్రభుత్వ బంగ్లా ఇవ్వలేదని చెప్పారు.
Read Also:Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
2022లో జైలులో ఉన్న మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుడి వద్దకు దర్యాప్తు సంస్థ వెళ్లి వాంగ్మూలం నమోదు చేసింది. ఫేస్టైమ్ ద్వారా కేజ్రీవాల్తో మాట్లాడేలా చేసింది విజయ్ నాయర్ అని, అందులో నాయర్ తన కుమారుడని, మీరు అతన్ని నమ్మవచ్చు అని సమీర్ చెప్పాడు. కొత్త మద్యం పాలసీ వెనుక కేజ్రీవాల్ ఉన్నారని విజయ్ నాయర్ చెప్పారు. పాలసీని రూపొందించకముందే, విజయ్ నాయర్ ఎటువంటి పదవి లేకుండా సౌత్ లాబీ మద్యం వ్యాపారులు, బీఆర్ఎస్ నాయకులు కవిత, బుచ్చిబాబు, సురేష్ మీనన్లతో తరచుగా సమావేశాలు నిర్వహించేవారు. విచారణ సమయంలో నాయర్, కేజ్రీవాల్లను ఏ హోదాలో వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారని అడిగినప్పుడు వారిద్దరూ ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోయారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!