Delhi Excise Policy: మద్యం కుంభకోణంలో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో 38 మంది నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో అరవింద్ కేజ్రీవాల్ను 37వ నిందితుడిగా పేర్కొనగా, ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 38వ నిందితుడిగా ఉంది. 232 పేజీల ఛార్జ్ షీట్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. మద్యం వ్యాపారులతో కుమ్మక్కయి తమకు అనుకూలంగా పాలసీని తయారు చేసుకోవడం ద్వారా పార్టీ నేతలు లబ్ధి పొందుతారని పేర్కొంది. కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడం వెనుక సిఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల లక్ష్యం లంచాలకు బదులుగా సౌత్ లాబీకి ప్రయోజనం చేకూర్చడమే. విచారణ ఆధారంగా విజయ్ నాయర్ పార్టీలో ఎటువంటి పదవిని నిర్వహించలేదని, అతను ఆప్ నాయకుల మధ్యవర్తి మాత్రమే అని చార్జ్ షీట్లో ఈడీ పేర్కొంది.
Read Also:Kurnool: ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు..
Also Read
- PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు 'కాన్వాయ్' కట్ చేసిన ప్రధాని మోడీ!
- Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
- Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం 'క్లాడ్ ఫర్ లీగల్'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
ఆప్ నేతలు లంచం తీసుకునేందుకు మార్గం సుగమం అయ్యేలా మద్యం వ్యాపారులతో కుమ్మక్కై తమకు అనుకూలంగా పాలసీని తయారు చేసుకోవడమే విజయ్ నాయర్ పని అని చార్జిషీట్ పేర్కొంది. 17 నవంబర్ 2022న ఇచ్చిన తన ప్రకటనలో.. తాను ఢిల్లీ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ పదవిని కలిగి లేనప్పటికీ, మార్చి 2021 నుండి కొత్త మద్యం పాలసీకి సంబంధించి మద్యం వ్యాపారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు విజయ్ నాయర్ తెలిపారు. మరుసటి రోజు నవంబర్ 18న ఇడి విచారణ సందర్భంగా విజయ్ నాయర్ తాను సిఎం నివాసానికి సమీపంలోని ప్రభుత్వ బంగ్లాలో నివసిస్తున్నట్లు చెప్పాడు. ఈ బంగ్లాను ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కైలాష్ గెహ్లాట్కు కేటాయించారు. అంతేకాకుండా, విజయ్ నాయర్ సిఎం క్యాంపు కార్యాలయం నుండి పనిచేస్తున్నట్లు కూడా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. నాయర్ ఎప్పుడూ ఏ ఎమ్మెల్యేను కలవలేదు.. ఆయన నేరుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతిషిలకు రిపోర్ట్ చేసేవారు. ఈ ఏడాది ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కైలాష్ గెహ్లాట్ వాంగ్మూలాన్ని కూడా ఈడీ రికార్డ్ చేసింది, అందులో నాయర్కు నేను నా ప్రభుత్వ బంగ్లా ఇవ్వలేదని చెప్పారు.
Read Also:Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
2022లో జైలులో ఉన్న మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుడి వద్దకు దర్యాప్తు సంస్థ వెళ్లి వాంగ్మూలం నమోదు చేసింది. ఫేస్టైమ్ ద్వారా కేజ్రీవాల్తో మాట్లాడేలా చేసింది విజయ్ నాయర్ అని, అందులో నాయర్ తన కుమారుడని, మీరు అతన్ని నమ్మవచ్చు అని సమీర్ చెప్పాడు. కొత్త మద్యం పాలసీ వెనుక కేజ్రీవాల్ ఉన్నారని విజయ్ నాయర్ చెప్పారు. పాలసీని రూపొందించకముందే, విజయ్ నాయర్ ఎటువంటి పదవి లేకుండా సౌత్ లాబీ మద్యం వ్యాపారులు, బీఆర్ఎస్ నాయకులు కవిత, బుచ్చిబాబు, సురేష్ మీనన్లతో తరచుగా సమావేశాలు నిర్వహించేవారు. విచారణ సమయంలో నాయర్, కేజ్రీవాల్లను ఏ హోదాలో వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారని అడిగినప్పుడు వారిద్దరూ ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోయారు.
తాజావార్తలు
-
PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు ‘కాన్వాయ్’ కట్ చేసిన ప్రధాని మోడీ!
-
Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
-
Peddi :‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ విడియోతో సోషల్ మీడియా షేక్..!
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!