DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ED మనీలాండరింగ్ కేసు నమోదు..
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తు సందర్భంగా గుర్తించిన భారీ ఆస్తులపై ఇప్పుడు ఈడీ దృష్టి సారించింది. భీమ్రెడ్డికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలోకి తీసుకువచ్చినట్లు సమాచారం.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భీమ్రెడ్డిని ఏసీబీ జూలై 6న అరెస్ట్ చేసింది. ఏసీబీ దర్యాప్తులో భాగంగా భీమ్రెడ్డికి సంబంధించి సుమారు రూ.150 కోట్లకుపైగా విలువైన ఆస్తులను గుర్తించారు. ఈ ఆస్తుల వివరాలను పరిశీలించిన అనంతరం అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును ఆస్తుల కొనుగోలుకు వినియోగించారా.? అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మణికొండ, గచ్చిబౌలి, తెల్లాపూర్, పటాన్చెరు, నాగోలు, మోమిన్పేట్, జహీరాబాద్తో పాటు బెంగళూరులోనూ భీమ్రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. మొత్తంగా దాదాపు 20 ఆస్తులను గుర్తించగా, వాటిలో ఎక్కువ ఆస్తులు ఇతరుల పేర్లపై ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
Also Read
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ఈ నేపథ్యంలో ఆస్తుల అసలు యజమానులు ఎవరు? వాటి కొనుగోలుకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? భీమ్రెడ్డికి సంబంధించిన వ్యక్తులు లేదా బినామీల పేర్లపై ఆస్తులు ఎందుకు కొనుగోలు చేశారు? అనే అంశాలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టింది. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును వివిధ మార్గాల్లో మళ్లించి ఆస్తులుగా మార్చారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఆదాయపు పన్ను శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్ కూడా భీమ్రెడ్డికి సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తుల్లో వెలుగులోకి వస్తున్న ఆస్తులు, లావాదేవీల వివరాలు కీలకంగా మారాయి.
దర్యాప్తు పూర్తయిన తర్వాత భీమ్రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన నిధుల మూలాలు, బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల యాజమాన్య వివరాలు, బినామీల పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆస్తులు అక్రమంగా సంపాదించినవేనని లేదా మనీలాండరింగ్ జరిగినట్లు తుది నిర్ధారణగా చెప్పలేం. ఈడీ దర్యాప్తులో వెలువడే వివరాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉండనున్నాయి.
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!