Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. ఈ వారంలో రెండోది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake : వరుస భూకంపాలతో ఇండోనేషియా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారం కిందే ఆ ద్వీపంలో భూకంపం సంభవించింది. మళ్లీ 6.2తీవ్రతతో భూమి కంపించింది. ఈ రోజు ఉదయం 6:30 గంటలకు సుమత్రా దీవుల్లో భూకంపం ఏర్పడింది. 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రతకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Nepal Plane Crash : విషాదం.. తన భర్తలాగే ప్రాణాలు కోల్పోయిన కో ఫైలట్
Also Read
ఇటు, ఇండోనేషియా వాతావరణ సంస్థ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘ఎసెహ్, దక్షిణ సుమత్రాలోని నాలుగు జిల్లాల్లో మాత్రమే భూమి కంపించింది. అది కూడా 3 నుంచి 10 సెకన్లు అంతే’ అని ఆ దేశ వాతావరణ కేంద్ర ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించాడు. వారం క్రితం తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు రావడం, ఆగ్నిపర్వతాలు బద్ధలు అవుతుంటాయి. అందుకు కారణం ఆ దేశం, పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడమే. అందుకనే తరచూ భూ పలకలు ఢీకొంటాయి. దాంతో, భూకంపం, అగ్నిపర్వతం పేలుళ్లు సంభవిస్తాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!