Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. ఈ వారంలో రెండోది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake : వరుస భూకంపాలతో ఇండోనేషియా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారం కిందే ఆ ద్వీపంలో భూకంపం సంభవించింది. మళ్లీ 6.2తీవ్రతతో భూమి కంపించింది. ఈ రోజు ఉదయం 6:30 గంటలకు సుమత్రా దీవుల్లో భూకంపం ఏర్పడింది. 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రతకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Nepal Plane Crash : విషాదం.. తన భర్తలాగే ప్రాణాలు కోల్పోయిన కో ఫైలట్
Also Read
ఇటు, ఇండోనేషియా వాతావరణ సంస్థ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘ఎసెహ్, దక్షిణ సుమత్రాలోని నాలుగు జిల్లాల్లో మాత్రమే భూమి కంపించింది. అది కూడా 3 నుంచి 10 సెకన్లు అంతే’ అని ఆ దేశ వాతావరణ కేంద్ర ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించాడు. వారం క్రితం తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు రావడం, ఆగ్నిపర్వతాలు బద్ధలు అవుతుంటాయి. అందుకు కారణం ఆ దేశం, పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడమే. అందుకనే తరచూ భూ పలకలు ఢీకొంటాయి. దాంతో, భూకంపం, అగ్నిపర్వతం పేలుళ్లు సంభవిస్తాయి.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!