E20 Fuel Policy: సుప్రీంకోర్టుకు చేరిన E20 ఫ్యూయల్ పాలసీ వివాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 Fuel Policy: భారతదేశంలో గత కొద్దీ రోజులుగా E20 ఫ్యూయల్ (20% ఎథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్)పై చర్చ తీవ్రతరమైంది. సోషల్ మీడియాలో అనేకమంది కారు వినియోగదారులు తమ వాహనాల్లో మైలేజ్ గణనీయంగా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు, సస్టెయినబిలిటీ లక్ష్యాలను చేరుకోవడానికై కేంద్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్లో E20 ఫ్యూయల్ను ప్రవేశపెట్టింది. కానీ, పాత వాహనాలు ఈ ఫ్యూయల్కి అనుకూలం కాకపోవడంతో కొన్ని కార్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని సుప్రీంకోర్టులోకి తీసుకెళ్లుతూ అడ్వకేట్ అక్షయ్ మల్హోత్రా ఇటీవల ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సెప్టెంబర్ 1, 2025న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్, న్యాయమూర్తులు కె. వినోద్ చంద్రన్, ఎన్.వి. అంజారియాలతో కూడిన బెంచ్ విచారించనుంది. ఇందులో ప్రధానంగా వినియోగదారులకు E0 పెట్రోల్ (ఎథనాల్ లేని పెట్రోల్) ఎంపికగా అందుబాటులో ఉండాలన్న డిమాండ్ ఉంది. అంతేకాకుండా, ఇంధన స్టేషన్లలో ఎథనాల్ శాతం స్పష్టంగా లేబుల్ చేయాలని పిటిషన్ కోరుతోంది.
Also Read
- Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
RIL Jio Frames: HD కెమెరా, లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్లతో రిలయన్స్ జియోఫ్రేమ్స్
E20 వివాదం తీవ్రతరమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక ట్వీట్లు, ప్రకటనల ద్వారా తన వైఖరిని తెలిపింది. పెట్రోలియం అండ్ సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపినదాని ప్రకారం ఎథనాల్ ఎనర్జీ డెన్సిటీ పెట్రోల్ కంటే తక్కువగా ఉండటంతో, మైలేజ్లో చాలా స్వల్పమైన తగ్గుదల ఉంటుందని. E10 కోసం డిజైన్ చేసి E20కి కాలిబ్రేట్ చేసిన నాలుగు చక్రాల వాహనాల్లో సుమారు 1-2% వరకు తగ్గుదల ఉండవచ్చని తెలిపింది. ఇతర వాహనాల్లో ఇది 3-6% వరకు ఉండొచ్చని పేర్కొంది. అయితే, ఇంజిన్ ట్యూనింగ్ మెరుగుపరిస్తే ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చని.. ఇప్పటికే అనేక ఆటోమొబైల్ కంపెనీలు E20 కంపాటిబుల్ మెటీరియల్స్ ఉపయోగిస్తున్నాయని పేర్కొంది.
మరో విషయానికి వస్తే.. E20 వాడితే వాహన ఇన్సూరెన్స్ రద్దవుతుందని వచ్చిన వార్తలను ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ఇన్సూరెన్స్ పాలసీ అమలులో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. అంతేకాదు, భారత్ 2026 అక్టోబర్ వరకు E20 కంటే ఎక్కువ మిశ్రమానికి వెళ్లదని.. ఆ తర్వాత మాత్రం అధిక మిశ్రమం తప్పనిసరిగా అమల్లోకి వస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్కు రెడీ!
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!