TS Police: డ్రగ్స్ కంట్రోల్- నార్కోటిక్ బ్యూరోల చీఫ్స్ గా హైదరాబాద్-సైబరాబాద్ సీపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత అటువైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త వింగ్ లను రాష్ట్ర హోం శాఖ స్టార్ట్ చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల మందితో నార్కోటిక్స్, సైబర్ బ్యూరోలను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ నివారణకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను నెలకొల్పనున్నారు. ఈ రెండు విభాగాలను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెండు విభాగాలు ఏర్పాటు చేశారు.
Read Also: Naresh: పవిత్ర అంటే ఎందుకంత పిచ్చి నరేషా..
Also Read
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
టవర్-బి లోని 13వ అంతస్తులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను.. టవర్-బిలోని 2,3 అంతస్తుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు. నార్కోటిక్ బ్యూరో అదనపు డీజీగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు అదనపు బాధ్యతలను అప్పగించగా.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాన్ని యువతకు అందించేందుకు ఈ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా అవగాహన కల్పిస్తారు. యువతకే కాదు డ్రగ్స్ యూజ్ చేస్తున్నా.. అందరికీ ఈ బ్యూరోలో కౌన్సిలింగ్ ఇస్తారు. తద్వారా వారిలో సత్ఫవర్తనను రాబట్టే విధంగా చేస్తారు. విదేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలను పట్టుకోవడంతో పాటు.. ఆ దేశాల అధికారులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటారు. అంతే కాకుండా రాష్ట్రాల్లోనూ ఈ సమాచారాన్ని మార్పిడి చేసుకుంటారు.
Read Also: Vizag Supari Gang: విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో వల్ల ఆన్లైన్ మోసాలు అనేవి ఎక్కువగా జరగకుండా చూసుకుంటూ.. ఒకవేళ మోసాలు జరిగిన కేసును త్వరితగతిన ఛేదించడానికి ఉపయోగపడతాయి. దేశాన్ని కుదిపోసిన 67 కోట్ల మంది డేటా చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాదు ఆ సమాచారాన్ని చోరీ చేసిన సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంతో శ్రమించారు. అదే కాకుండా ఇంకా సైబర్ నేరాలు ఎన్ని ఉన్నాయో వాటి అన్నింటికి ఈ బ్యూరో ఎంతో ఉపయోగపడుతోంది.
తాజావార్తలు
-
India’s Most Powerful Women 2026: దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు ఎవరు?.. ఏకంగా రూ.39 లక్షల కోట్ల ఆస్తులు!
-
Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!