Myanmar: బంగ్లాదేశ్కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ దాడి..200 మందికి పైగా మృతి
- మయన్మార్ నుంచి మరోసారి బాధాకరమైన వార్త
- మయన్మార్ విడిచి బంగ్లాదేశ్కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ దాడి
- ఇందులో 200 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోహింగ్యాలకు సంబంధించి మయన్మార్ నుంచి మరోసారి బాధాకరమైన వార్త వెలువడింది. మయన్మార్ విడిచి బంగ్లాదేశ్కు పారిపోతున్న రోహింగ్యాలపై డ్రోన్ల ద్వారా దాడులు చేశారు. ఇందులో 200 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. నాఫ్ నది గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నించగా వారిపై దాడి జరిగింది. బంగ్లాదేశ్ సరిహద్దులో దాడి జరిగిందని సాక్షులు చెప్పారు. ఇది రాఖైన్ రాష్ట్రంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా అధికారులు అభివర్ణించారు. గర్భిణీ స్త్రీతో పాటు ఆమె 2 ఏళ్ల కుమార్తె కూడా మరణించారని చెప్పారు. ఈ దాడికి మిలీషియా, మయన్మార్ సైన్యం పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దులు దాటేందుకు ప్రజలు వేచి ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. గత కొన్ని వారాలుగా మయన్మార్ మిలటరీ (జుంటా), అరాకన్ ఆర్మీ(రెబెల్స్) కు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగింది.
READ MORE: Bangladesh : బంగ్లాదేశ్లో హింస తర్వాత.. ఇప్పుడు మరో సంక్షోభం.. ప్రజల ఆరాటం దేనికంటే?
Also Read
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
- Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి 'పాడే యాత్రే'.!
- Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో.. మృతదేహాలు బురదలో చెల్లాచెదురుగా కనిపించాయి. వాటి చుట్టూ సూట్కేసులు, బ్యాక్ప్యాక్లు తేలియాడుతున్నాయి. ముగ్గురు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 200 మందికి పైగా మరణించారని, మరొకరు 70 మందికి పైగా మరణించారని చెప్పారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ దాడి మయన్మార్ తీరప్రాంత నగరమైన మౌంగ్డావ్ వెలుపల జరిగింది. మహమ్మద్ ఇలియాస్ (35) అనే ప్రత్యక్ష సాక్షి, తన గర్భవతి అయిన భార్య, 2 సంవత్సరాల కుమార్తెను కోల్పోయాడు. డ్రోన్లు గుంపుపై దాడి చేయడం ప్రారంభించినప్పుడు.. తాను నదిలో వారితో నిలబడి ఉన్నానని ఇలియాస్ చెప్పాడు.
Drone attack
తాజావార్తలు
-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి ‘పాడే యాత్రే’.!
-
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ