BCCI: క్రికెటర్లకు గుడ్ న్యూస్.. ప్రైజ్ మనీ డబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: ప్రస్తుతం ఐపీఎల్ రసవత్తరంగా నడుస్తోంది. ఈ సమయంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లోని ఆటగాళ్లకు ఇచ్చే ప్రైజ్ మనీని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ ప్రారంభం కాగానే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆటగాళ్లకు ఈ భారీ బహుమతిని అందజేసింది. కొత్త నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఐదు కోట్ల నగదు బహుమతి ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు రంజీ ట్రోఫీ టోర్నీ విజేతలకు రూ.2 కోట్లు బహుమతిగా ఇచ్చేవారు. ఇప్పుడు దానిని పెంచాలని నిర్ణయించారు. బిసిసిఐ సెక్రటరీ జై షా ఒక ట్వీట్లో, “దేశీయ క్రికెట్.. భారత క్రికెట్కు వెన్నెముక అ, అన్ని దేశీయ పోటీలకు ప్రైజ్ మనీని పెంచుతున్నట్లు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశవాళీ క్రికెట్లో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాం. రంజీ విజేతలకు ఇప్పుడు రూ. 5 కోట్లు (రూ. 2 కోట్ల నుంచి), సీనియర్ గ్రూప్ మహిళా విజేతలు రూ. 50 లక్షలు (రూ. 6 లక్షల నుంచి) అందుకుంటారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది.
Read Also: CM YS Jagan: రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన.. గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Campbell Thomson: "ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
ఇరానీ కప్ విజేతలకు రూ.25 లక్షల బదులు ఇప్పుడు రూ.50 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. రన్నరప్గా నిలిచిన వారికి ఇప్పుడు రూ.25 లక్షల బహుమతి లభిస్తుంది. రన్నరప్కు ఇంతకు ముందు నగదు బహుమతి రాలేదు. జూన్ 28న దులీప్ ట్రోఫీతో దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. దులీప్ విజేతలకు కోటి రూపాయల బహుమతి, రన్నరప్కు 50 లక్షల రూపాయల బహుమతి లభిస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ విజేతలకు రూ. కోటి, రన్నరప్లకు రూ. 50 లక్షలు, దేవధర్ కరందక్ విజేతలకు రూ. 40 లక్షలు, రన్నరప్కు రూ. 20 లక్షలు బహుమతిగా అందజేయనున్నారు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ పోటీల్లో విజేతలకు రూ.80 లక్షలు, రన్నరప్గా నిలిచిన వారికి రూ.40 లక్షలు బహుమతిగా అందజేస్తారు.
Read Also: NIA: భారత హైకమిషన్పై ఖలిస్తాన్ వేర్పాటువాదుల దాడి.. ఎన్ఐఏ విచారణ
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!