CM YS Jagan: రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన.. గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటకు వెళ్లనున్న ఆయన.. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు. ఇక, మూలపేట పర్యటన కోసం.. బుధవారం ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరనున్నారు సీఎం.. ఉదయం 10.30 గంటలకు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.. గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేయనున్నారు ఏపీ సీఎం.. ఇక, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు శంకుస్ధాపన చేస్తారు.. మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఉత్తర్వులు జారీ
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేసింది. ఏప్రిల్ 19న గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ములపేట, విష్ణుచక్రం గ్రామాల రైతులు ప్రతిపాదిత పోర్టు ప్రాంతంలో భావనపాడు గ్రామం పరిధి లేదని, ముల్పేటలోని అన్ని భూములను పరిగణనలోకి తీసుకుని పేరు మార్చాలని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు (ఓడరేవులు) స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవెన్ తెలిపారు. అందుకే, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, భావనపాడు పోర్టుకు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్గా పేరు మార్చడానికి ప్రతిపాదనలు పెట్టారు, మొత్తం భూమి మరియు ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలు మూలపేట మరియు విష్ణుచక్రం గ్రామాలకు చెందినవి మరియు భావనపాడు కాదు అని ఒక ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!