CM YS Jagan: రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన.. గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటకు వెళ్లనున్న ఆయన.. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు. ఇక, మూలపేట పర్యటన కోసం.. బుధవారం ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరనున్నారు సీఎం.. ఉదయం 10.30 గంటలకు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.. గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేయనున్నారు ఏపీ సీఎం.. ఇక, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు శంకుస్ధాపన చేస్తారు.. మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఉత్తర్వులు జారీ
Also Read
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేసింది. ఏప్రిల్ 19న గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ములపేట, విష్ణుచక్రం గ్రామాల రైతులు ప్రతిపాదిత పోర్టు ప్రాంతంలో భావనపాడు గ్రామం పరిధి లేదని, ముల్పేటలోని అన్ని భూములను పరిగణనలోకి తీసుకుని పేరు మార్చాలని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు (ఓడరేవులు) స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవెన్ తెలిపారు. అందుకే, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, భావనపాడు పోర్టుకు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్గా పేరు మార్చడానికి ప్రతిపాదనలు పెట్టారు, మొత్తం భూమి మరియు ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలు మూలపేట మరియు విష్ణుచక్రం గ్రామాలకు చెందినవి మరియు భావనపాడు కాదు అని ఒక ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!