DOST Applications : ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ ప్రవేశాల షెడ్యూలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాలకు దోస్త్ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి జూన్ 10 వరకు దోస్ట్ వెబ్సైట్ (dost.cgg.gov.in)లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈనెల 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. జూన్ 16న తొలి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు చేపడతారు. జూన్ 30న రెండో విడత, జులై 10న మూడో విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 17న తరగతులు ప్రారంభం అవుతాయి. ఇదిలా ఉంటే.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో మెదక్ చివరి స్థానంలో నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లాకు ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే.. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడం గమనార్హం. జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఫెయిలైన విద్యార్థులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దన్నారు.
Also Read : Karnataka Election: కర్ణాటక ఫలితాలపై జోరుగా బెట్టింగ్.. గెలుపెవరిది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
అయితే.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోనే పూర్తయింది. పలు దఫాలుగా ట్రయల్రన్ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారణ అయిన తర్వాత.. ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
Also Read : Mahmood Ali : ఇస్లామిక్ రాడికల్స్ కేసును దర్యాప్తు చేస్తున్నాం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!