Mahender Reddy: కాంగ్రెస్, బీజేపీ పథకాలను నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్, చేవెళ్ల, నవాబుపేటలో రూ. 21 కోట్ల 49 లక్షల అభివృద్ధి పనులకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సురంగాల్ లో శివాజీ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణా పథకాలను దేశంలోని కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో కాపీ కొడుతున్నారన్నారు. దేశం తెలంగాణా వైపు చూస్తుంటే… ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి విమర్శించారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు.
Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నది
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
ఎన్నికల అప్పుడే గ్రామాల్లో తిరుగుతూ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రజలు నమ్మరని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వేలకోట్లతో అభివృద్ధి సాగుతుందని, సంక్షేమ పథకాలు సైతం అలానే అమలవుతున్నాయని వెల్లడించారు. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఉందని.. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఎక్కడున్నాయని మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజలు సీఎం కేసీఆర్ ను మరో మారు దీవిస్తారని, ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా యాదయ్యను, ఎంపీగా రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
Muthireddy Yadagiri Reddy: ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా
ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాగుతుందని చెప్పారు. వ్యక్తిగత పథకాలు పేదరిక నిర్మూలనకు తోడ్పడుతాయని చెప్పారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాగుతుందని అందుకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు మరో మారు తనను దీవించాలని కోరారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!