Cash Transaction: క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇష్టమొచ్చి నట్టు చేస్తున్నారా? వారికి ఆటోమెటిక్గా వివరాలు..
- ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు..
- ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి..
- రూ.10 లక్షలకు మించి చేసిన బ్యాంకులు సదరు వ్యక్తుల వివరాలు ఆటోమెటిక్గా పన్ను శాఖకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cash Transaction: దేశంలోని ప్రజలు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారి ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాలని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు. ప్రజలు చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ గురించి అధికారులకు తెలుసు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి దేశంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో చట్ట ప్రకారం ఆదాయంపై పన్ను విధించినా.. లేని పక్షంలో పన్నుల శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు వచ్చినప్పుడు రూ.10 కూడా చెల్లించేందుకు యూపీఐని ఉపయోగిస్తున్నాం. అందువల్ల, ప్రతి లావాదేవీ ఒక ఖాతా అని ప్రజలు మరచిపోకూడదు.
Read also: Money In Car Stepney: కారు స్టెప్నీలో రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Also Read
- India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
- Astrology: ఆగస్టు 15 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..!
- Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
- BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
ఇక పన్ను శాఖ ప్రకారం, బ్యాంకులో సంవత్సరానికి రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ.10 లక్షలకు మించి చేసిన బ్యాంకులు సదరు వ్యక్తుల వివరాలు ఆటోమెటిక్గా పన్ను శాఖకు అందిస్తుంది. వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమలు, ఉపసంహరణలను కూడా పన్ను శాఖ పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు, అది సమస్యలను తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి. పరిమితికి మించి డిపాజిట్లు చేస్తే పన్ను శాఖ నోటీసులు పంపుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే బ్యాంకులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. అదే క్రమంలో, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డ్ వివరాలను అందించాలి. కాబట్టి మీరు చేసే చెల్లింపుల వివరాలు పన్ను అధికారుల దృష్టికి వస్తాయని గుర్తుంచుకోండి.
Read also: Diabetic Cataract Problem: డయాబెటిక్ పేషెంట్లలో కంటిశుక్లం ఎంత వరకు ప్రభావితం అవుతుందంటే?
అలాగే ఖాతాలో రూ.50 లక్షల కంటే ఎక్కువ జమ చేసినట్లయితే ఆ వివరాలను పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంక్ ఖాతా నుండి రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్లో రూ.50,000 కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు లేదా విత్డ్రా చేసేటప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డ్ను సమర్పించాలి. పాన్ కార్డు లేని నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను నోటీసులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొనుగోలుదారులు బ్యాంకుల్లోనే కాకుండా, ఏదైనా షాపింగ్ లేదా ఆభరణాల కొనుగోలులో కూడా రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం తమ పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి.
Shyam Sundara Kulkarni: ప్రముఖ లిరిసిస్ట్ మృతి.. ఇండస్ట్రీలో విషాదం
తాజావార్తలు
-
iQOO Smartphone: భారీగా పెరిగిన iQOO స్మార్ట్ఫోన్ల ధరలు.. iQOO 15, 15R, Neo 10 కొత్త ధరలు ఇవే!
-
India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
-
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా ‘శనార్థి’.. సంపత్ నంది బ్యానర్లో కొత్త కాంబినేషన్!
-
Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Astrology: ఆగస్టు 15 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!