Minister KTR: కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. బీఆర్ఎస్ కావాలో.. రైతులే చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పాలిటిక్స్ మంచి రసవత్తరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ పార్టీ కావాలో తెలంగాణ రైతులే తెల్చుకోవాలని ఆయన సూచించారు.
Read Also: Tamota : సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం టమాటా అమ్మకాలు.. కిలో ఎంతో తెలుసా?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
కాగా, మంత్రి కేటీఆర్ ఇవాళ (శనివారం) బీఆర్ఎస్ శ్రేణులతో టెలీకాన్షరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దుతో పాటు కేవలం రైతులకు మూడు గంటల విద్యుత్ చాలన్న హస్తం పార్టీ విధానంపై ప్రతీ గ్రామంలో చర్చ జరగాలి అని ఆయన అన్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Also: Sitara: ఇది కదా పెంపకం అంటే.. తండ్రి బాటలోనే కోటి దానమిచ్చిన సితార?
ఈనెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రైతు సమావేశాలు జరుగుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతీ రైతు వేదిక దగ్గర రైతు సమావేశం ఏర్పాటు చేయాలి.. బీఆర్ఎస్ విధానం మూడు పంటలు.. మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం పేరిట ఈ మీటింగ్స్ నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులను అవమానించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి వెంటనే క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలన్నారు. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ వద్దన్న రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ కుట్రను రైతాంగానికి వివరించాలని కేటీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..