PM Kisan: 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడో తెలుసా..?
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి
- ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 ఆర్థిక సహాయం
- కేంద్ర ప్రభుత్వం వచ్చే అక్టోబర్లో పీఎం కిసాన్ 18వ విడతను విడుదల అవకాశం
- ప్రతి విడత నాలుగు నెలల వ్యవధిలో విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద దేశంలోని పేద రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను జూన్ నెలలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన విడుదలై నెల రోజులు దాటింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇప్పుడు 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను కేంద్ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Stock Market: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్ సూచీలు
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
మీడియా నివేదికల ప్రకారం.. భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను విడుదల చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి విడత నాలుగు నెలల వ్యవధిలో విడుదల చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో 17వ విడత డబ్బును విడుదల చేసింది. ఈ క్రమంలోనే 18వ విడత నిధులు అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Read Also: Minister Uttam: సాంకేతిక కారణాలతో కాని వారికి త్వరలో రుణమాఫీ..
మరోవైపు.. ఒక కుటుంబంలోని రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందగలరా అనే ప్రశ్న చాలా మంది రైతుల్లో ఉంటుంది. అయితే.. ఒక కుటుంబంలో రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడిందో వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందగలరు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!