PM Kisan: 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడో తెలుసా..?
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి
- ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 ఆర్థిక సహాయం
- కేంద్ర ప్రభుత్వం వచ్చే అక్టోబర్లో పీఎం కిసాన్ 18వ విడతను విడుదల అవకాశం
- ప్రతి విడత నాలుగు నెలల వ్యవధిలో విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద దేశంలోని పేద రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను జూన్ నెలలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన విడుదలై నెల రోజులు దాటింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇప్పుడు 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను కేంద్ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Stock Market: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్ సూచీలు
Also Read
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
మీడియా నివేదికల ప్రకారం.. భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను విడుదల చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి విడత నాలుగు నెలల వ్యవధిలో విడుదల చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో 17వ విడత డబ్బును విడుదల చేసింది. ఈ క్రమంలోనే 18వ విడత నిధులు అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Read Also: Minister Uttam: సాంకేతిక కారణాలతో కాని వారికి త్వరలో రుణమాఫీ..
మరోవైపు.. ఒక కుటుంబంలోని రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందగలరా అనే ప్రశ్న చాలా మంది రైతుల్లో ఉంటుంది. అయితే.. ఒక కుటుంబంలో రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడిందో వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందగలరు.
తాజావార్తలు
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!