PM Kisan: 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడో తెలుసా..?
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ధి
- ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 ఆర్థిక సహాయం
- కేంద్ర ప్రభుత్వం వచ్చే అక్టోబర్లో పీఎం కిసాన్ 18వ విడతను విడుదల అవకాశం
- ప్రతి విడత నాలుగు నెలల వ్యవధిలో విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద దేశంలోని పేద రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను జూన్ నెలలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ ప్రకటన విడుదలై నెల రోజులు దాటింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇప్పుడు 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను కేంద్ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Stock Market: ఫ్లాట్గా ముగిసిన మార్కెట్ సూచీలు
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- Off The Record: రొటీన్కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
మీడియా నివేదికల ప్రకారం.. భారత ప్రభుత్వం వచ్చే అక్టోబర్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను విడుదల చేయవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి విడత నాలుగు నెలల వ్యవధిలో విడుదల చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో 17వ విడత డబ్బును విడుదల చేసింది. ఈ క్రమంలోనే 18వ విడత నిధులు అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Read Also: Minister Uttam: సాంకేతిక కారణాలతో కాని వారికి త్వరలో రుణమాఫీ..
మరోవైపు.. ఒక కుటుంబంలోని రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పీఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందగలరా అనే ప్రశ్న చాలా మంది రైతుల్లో ఉంటుంది. అయితే.. ఒక కుటుంబంలో రైతు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడిందో వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలను పొందగలరు.
తాజావార్తలు
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!