Kargil Vijay Diwas 2024: కార్గిల్ విజయ్ దివాస్ చరిత్ర మీకు తెలుసా? రోమాలు నిక్కబొడిచే కథ..
- జులై 26.. 1999న పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొడుతూ కార్గిల్లో భారతదేశం విజయ కేతనం
- అప్పటి నుంచి ఏటా కార్గిల్ విజయ్ దివస్
- శత్రుదేశంపై విజయం సాధించి నేటికి సరిగ్గా 25 ఏళ్లు
- ఈ రోజు భారతదేశాన్ని విజయపథంలో నడిపించిన సైనికుల ధైర్యసాహసాలకు అంకితం
- కార్గిల్ విజయ్ దివస్ యొక్క అనేక వీరోచిత కథలు
- కెప్టెన్ విక్రమ్ బత్రా కథ ధైర్యం.. దేశభక్తికి చిహ్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై 26, 1999న పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొడుతూ కార్గిల్లో భారతదేశం విజయ పతాకాన్ని ఎగురవేసింది. అప్పటి నుంచి భారతదేశం ప్రతి సంవత్సరం జులై 26న కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకుంటుంది. శత్రుదేశంపై విజయం సాధించి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. ఈ రోజు భారతదేశాన్ని విజయపథంలో నడిపించిన సైనికుల ధైర్యసాహసాలకు అంకితం చేయబడింది. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించే రోజు కూడా. 1999లో ఇదే రోజున కార్గిల్ మంచు శిఖరాలపై దాదాపు మూడు నెలల పాటు సాయుధ పోరాటం జరిగింది. భారత దళాలు పాకిస్థాన్ రేంజర్లపై తమ విజయాన్ని ప్రకటించాయి. కార్గిల్ విజయ్ దివస్ యొక్క అనేక వీరోచిత కథలు ఉన్నాయి. ఇందులో కెప్టెన్ విక్రమ్ బత్రా కథ ధైర్యం మరియు దేశభక్తికి చిహ్నంగా కనిపిస్తుంది. “యే దిల్ మాంగే మోర్” అని కెప్టెన్ విక్రమ్ బాత్రా అన్నారు.
READ MORE:US vs India: భారత్కు అండగా ఉండాలంటే.. పాక్కు సహాయాన్ని నిషేధించాలి: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
Also Read
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
అసలు యుద్ధం మొదలవ్వడానికి కారణం..
1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత అనేక సైనిక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 1998లో ఇరు దేశాలు అణు పరీక్షలు నిర్వహించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. 1999 ఫిబ్రవరిలో పరిస్థితిని శాంతింపజేయడానికి.. కాశ్మీర్ వివాదానికి శాంతియుత, ద్వైపాక్షిక పరిష్కారాన్ని అందిస్తామని హామీ ఇస్తూ లాహోర్ డిక్లరేషన్ పై ఇరు దేశాలు సంతకం చేశాయి. కానీ పాకిస్థాన్ తన దొంగ బుద్ధిని బయటపెట్టింది. సాయుధ దళాలు తమ సైనికులను, పారామిలటరీ దళాలను నియంత్రణ రేఖ (ఎల్ఓసి) దాటి భారత భూభాగంలోకి పంపింది. ఈ దుర్మార్గపు చొరబాట్లకు ‘ఆపరేషన్ బదర్’ అని కోడ్ పెట్టింది. కశ్మీర్, లడఖ్ ల మధ్య సంబంధాన్ని తెంచుకోవడం, సియాచిన్ హిమానీనదం నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవడం దీని ప్రధాన లక్ష్యం. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు సృష్టించినా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చడానికి దోహదపడుతుందని, సత్వర పరిష్కారానికి సాయ పడుతుందని పాకిస్థాన్ భావించింది. 1998-1999 శీతాకాలంలో సియాచిన్ గ్లేసియర్ ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో పాక్ సైన్యం రహస్యంగా కార్గిల్ సమీపంలో దళాలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఈ దొంగ బుద్దిని పసిగట్టిన భారత్ ప్రశ్నించగా.. వారు పాక్ సైనికులు కాదని, ముజాహిదీన్లు అని పాక్ ఆర్మీ ప్రకటించింది. తద్వారా సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేలా భారత సైన్యంపై ఒత్తిడి తీసుకురావడం, కశ్మీర్ వివాదం కోసం చర్చలు జరిపేందుకు భారత్ ను బలవంతం చేయడం పాక్ ప్రధాన ఉద్దేశం.
READ MORE:Fancy Number Hyderabad: భారీ మొత్తానికి ఫ్యాన్సీ నెంబర్లు.. వాహన యజమానుల్లో పెరుగుతున్న క్రేజ్
యుద్ధం ఎప్పుడు ప్రారంభమైందంటే..?
3 మే 1999న, కార్గిల్లోని స్థానిక గొర్రెల కాపరి ఈ ప్రాంతంలోని పాకిస్థానీ సైనికులు, తీవ్రవాదుల గురించి భారత సైన్యాన్ని అప్రమత్తం చేశారు.
మే 5, 1999న పాక్ సైనికులు దాదాపు 5 మంది భారత సైనికులను హతమార్చారు. దీంతో అప్రమత్తమైన భారత్ సైన్యం పాక్ కు సమాధానం చెప్పేందుకు పూనుకుంది. 1999 మే 10న భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ ప్రారంభించింది. కార్గిల్లో భారత ఆర్మీకి చెందిన మందుగుండు సామగ్రి నిక్షేపాలను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది.1999 మే 26న భారత సైన్యం వైమానిక దాడులు చేసింది. 27 మే 1999న IAF, MiG-27 కూలిపోయింది. నలుగురు భారత ఎయిర్ఫోర్స్ సిబ్బంది వీరమరణం పొందారు. ఎజెక్ట్ చేస్తున్న పైలట్ను పాకిస్థాన్ యుద్ధ ఖైదీగా పట్టుకుంది.1999 మే 31న అటల్ బిహారీ వాజ్పేయి కార్గిల్లో యుద్ధం లాంటి పరిస్థితిని ప్రకటించారు. 1 జూన్ 1999న, యూఎస్ ఏ (USA) మరియు ఫ్రాన్స్ భారత్పై సైనిక కార్యకలాపాలకు పాకిస్థాన్ను బాధ్యులను చేశాయి. 5 జూన్ 1999న పాకిస్థాన్ ప్రమేయాన్ని చూపించే పత్రాలను భారత సైన్యం విడుదల చేసింది. 9 జూన్ 1999న బటాలిక్ సెక్టార్లోని రెండు ముఖ్యమైన స్థానాలను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది.
READ MORE: Janhvi Kapoor-NTR: నాకు 10 రోజులు పడితే.. ఎన్టీఆర్కు సింగిల్ సెకనే: జాన్వీ కపూర్
జూన్ 10, 1999న, పాకిస్థాన్ జాట్ రెజిమెంట్లోని 6 మంది సైనికులు ఛిద్రమైన మృతదేహాలను తిరిగి ఇచ్చింది. 13 జూన్ 1999న యుద్ధం యొక్క దిశను మార్చడానికి భారతదేశం కీలకమైన టోలోలింగ్ శిఖరాన్ని తిరిగి పొందింది. జూన్ 15, 1999న, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాక్ సైనికులను వెనక్కి రప్పించాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను కోరారు.1999 జూన్ 20న టైగర్ హిల్ సమీపంలోని పాయింట్ 5060 మరియు పాయింట్ 5100లను 11 గంటల యుద్ధం తర్వాత భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. 5 జూలై 1999న బిల్ క్లింటన్ నవాజ్ షరీఫ్ను కలిశారు. కార్గిల్ నుంచి పాకిస్థాన్ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్తాన్ పీఎం ప్రకటించారు. 11 జూలై 1999న పాకిస్థాన్ సేనలు తిరోగమనం ప్రారంభించాయి. బటాలిక్లోని అనేక శిఖరాలను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. 1999 జూలై 14న ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతమైందని భారత సైన్యం ప్రకటించింది. 1999 జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసింది. అందుకే ఈ రోజును ‘కార్గిల్ విజయ్ దివస్’గా పరిగణిస్తారు.
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..