ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఐదవ రోజు. నిన్న అంటే గురువారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర రభస జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు వాకౌట్ కూడా చేశారు.
25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్యక్రమం కోసం ప్రధాని మోడీ కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని, 1999లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు.
25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్యక్రమం కోసం ప్రధాని మోడీ కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని, 1999లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు.
జులై 26, 1999న పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొడుతూ కార్గిల్లో భారతదేశం విజయ పతాకాన్ని ఎగురవేసింది. అప్పటి నుంచి భారతదేశం ప్రతి సంవత్సరం జులై 26న కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకుంటుంది.