Unhealthy Foods: ఈ ఆహారాలను తీసుకోవద్దు.. ప్రాణాలకు ముప్పంటూ డబ్ల్యూహెచ్వో వార్నింగ్
- డబ్ల్యూహెచ్ఓ అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితా విడుదల
- ఈ ఆహారం తినడం వల్ల అనేక రోగాల బారిన పడుతున్న ప్రజలు
- ఊబకాయం.. గుండె జబ్బులు.. క్యాన్సర్.. మధుమేహం వంటి రోగాలు వచ్చే అవకాశం
- ఆరోగ్యంగా.. ఫిట్గా ఉండటానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించిన డబ్ల్యూహెచ్ఓ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యం, ఫిట్నెస్పై సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం మన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కానీ మనం ఎక్కువగా కెమికల్స్తో కూడిన జంక్ ఫుడ్స్ తింటున్నాం. ఈ క్రమంలో.. అవి మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీంతో.. మన శరీరం అనేక వ్యాధుల బారిలో పడుతుంది. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా అనారోగ్యకరమైన ఆహారాలు, ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి కొన్ని అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఇవి తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపి రోగాల బారిన పడుతున్నారు. ఇంతకీ.. డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన జాబితాలో అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల వచ్చే రోగాల గురించి తెలిపింది. అవి.. ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం అని చెప్పింది. ఈ క్రమంలో ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి.. మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించింది. డబ్ల్యూహెచ్వో జారీ చేసిన అనారోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఏవీ ఉన్నాయో తెలుసుకుందాం..
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
Election Commission: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం మానుకోండి:
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితాలో ప్రాసెస్ చేసిన మాంసం ఉంది. అలాగే.. సాసేజ్, హామ్, బేకన్ మొదలైన ప్రాసెస్ చేసిన మాంసాలను తినొద్దని సూచించింది. వాటిలో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. అంతే కాకుండా రసాయనాల సాయంతో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్, ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
చక్కెర కలిపిన పానీయాలు:
చక్కెర మిశ్రమ పానీయాలలో అధిక కేలరీలు ఉంటాయి. ఇది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సోడా, ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. వీటికి బదులు నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్వో సూచించింది.
ట్రాన్స్ ఫ్యాట్:
మన శరీరంలో కొలెస్ట్రాల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందు కోసం ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ వినియోగానికి దూరంగా ఉండాలి. ఇవి తింటే.. కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
తెల్ల ఉప్పు:
అయోడిన్ సరఫరా చేయడానికి ఉప్పు ఉపయోగిస్తారు. అయోడిన్ శరీరానికి చాలా ముఖ్యమైనది. అందుకోసం.. డబ్ల్యూహెచ్వో ఇటీవల రోజుకు 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదని సూచించింది. ఎందుకంటే ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!