Potina Mahesh: కాపుల కోసం పోరాడవా?.. వంగవీటి రాధాపై పోతిన మహేష్ ఫైర్!
- వంగవీటి రంగా 36వ వర్ధంతి
- రంగా ఆశయాల కోసం ఎక్కడా నిలబడలేదు
- రాధా మాట్లాడకపోవడం నాకు బాధేస్తుంది
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాపై వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు.. కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల పైన రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు కానీ.. రంగా ఆశయాల కోసం రాధా ఎక్కడా నిలబడనిలేదన్నారు. రంగా కొడుకు రాధా ఆలోచన తనకు అర్ధం కావడం లేదని, కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా రాధా ఎప్పుడు బయటకు రాలేదని పోతిన మహేష్ ప్రశ్నించారు.
కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా 36వ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. ఏపీలోని పలు చోట్ల వర్ధంతి వేడుకల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ చెరువు సెంటర్లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నేత పోతిన మహేష్ పాల్గొన్నారు. ‘వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు.. కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారు. కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు ఒక్క మాట మాట్లాడలేదు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు కానీ రంగా ఆశయాల కోసం ఎక్కడా నిలబడలేదు. రంగా కొడుకు రాధా ఆలోచన అర్ధం కావడం లేదు. కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా.. రాధా ఎప్పుడు బయటకు రాలేదు. అయినా రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయి. ప్రజా సమస్యలపై, కాపు సామాజిక వర్గ సమస్యలపై రాధా మాట్లాడకపోవడం నాకు బాధేస్తుంది. ఎన్నికల్లో మాత్రమే రాధా బయటకు వస్తున్నారు. మిగతా అంశాల్లో బయటకు రాకపోవడం రంగా వారసులమైన మాలాంటి వాళ్లకు బాధేస్తుంది’ అని పోతిన మహేష్ అన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Also Read: Top Headlines @1PM: టాప్ న్యూస్!
‘రంగా పేరు జిల్లాకు పెట్టాలని రాధా ఎక్కడా మాట్లాడడం లేదు ఎందుకు. వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారులకు రాధా మేలు చేసినవి ఎన్నో ఉన్నాయి. రాధా పదవి గురించి మాట్లాడడం కాదు.. రంగా ఆశయాల సాధన కోసం నడుం బిగించాలి. అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకుంటే ఎలా?. మాకు పదవుల మీద వ్యామోహం లేదు, సీటు రాకపోయినా పోరాటం చేస్తున్నాం. బీసీ వర్గాల భవిష్యత్తును కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపడం దురదృష్టకరం. ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలిపిన వ్యక్తి రంగా. వంగవీటి రంగా అందరి వాడు కానీ.. సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉంది’ అని పోతిన మహేష్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!