Potina Mahesh: కాపుల కోసం పోరాడవా?.. వంగవీటి రాధాపై పోతిన మహేష్ ఫైర్!
- వంగవీటి రంగా 36వ వర్ధంతి
- రంగా ఆశయాల కోసం ఎక్కడా నిలబడలేదు
- రాధా మాట్లాడకపోవడం నాకు బాధేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాపై వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు.. కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్ల పైన రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు కానీ.. రంగా ఆశయాల కోసం రాధా ఎక్కడా నిలబడనిలేదన్నారు. రంగా కొడుకు రాధా ఆలోచన తనకు అర్ధం కావడం లేదని, కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా రాధా ఎప్పుడు బయటకు రాలేదని పోతిన మహేష్ ప్రశ్నించారు.
కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా 36వ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. ఏపీలోని పలు చోట్ల వర్ధంతి వేడుకల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ చెరువు సెంటర్లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నేత పోతిన మహేష్ పాల్గొన్నారు. ‘వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు.. కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారు. కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు ఒక్క మాట మాట్లాడలేదు. విగ్రహావిష్కరణలు చేస్తూ నేనే వారసుడని రాధా చెప్పుకుంటున్నారు కానీ రంగా ఆశయాల కోసం ఎక్కడా నిలబడలేదు. రంగా కొడుకు రాధా ఆలోచన అర్ధం కావడం లేదు. కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా.. రాధా ఎప్పుడు బయటకు రాలేదు. అయినా రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయి. ప్రజా సమస్యలపై, కాపు సామాజిక వర్గ సమస్యలపై రాధా మాట్లాడకపోవడం నాకు బాధేస్తుంది. ఎన్నికల్లో మాత్రమే రాధా బయటకు వస్తున్నారు. మిగతా అంశాల్లో బయటకు రాకపోవడం రంగా వారసులమైన మాలాంటి వాళ్లకు బాధేస్తుంది’ అని పోతిన మహేష్ అన్నారు.
Also Read
Also Read: Top Headlines @1PM: టాప్ న్యూస్!
‘రంగా పేరు జిల్లాకు పెట్టాలని రాధా ఎక్కడా మాట్లాడడం లేదు ఎందుకు. వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారులకు రాధా మేలు చేసినవి ఎన్నో ఉన్నాయి. రాధా పదవి గురించి మాట్లాడడం కాదు.. రంగా ఆశయాల సాధన కోసం నడుం బిగించాలి. అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకుంటే ఎలా?. మాకు పదవుల మీద వ్యామోహం లేదు, సీటు రాకపోయినా పోరాటం చేస్తున్నాం. బీసీ వర్గాల భవిష్యత్తును కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపడం దురదృష్టకరం. ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలిపిన వ్యక్తి రంగా. వంగవీటి రంగా అందరి వాడు కానీ.. సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉంది’ అని పోతిన మహేష్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!