DMK MP TR Baalu: మంత్రి ఉదయనిధి స్టాలిన్కు డీఎంకే ఎంపీ హెచ్చరిక.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK MP TR Baalu: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కోశాధికారి మరియు ఎంపీ టీఆర్ బాలు, డీఎంకే యువజన విభాగం అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు హెచ్చరిక నోట్ జారీ చేశారు. తన రాజకీయ జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కోరారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చి, దాని నిర్మూలనకు పిలుపునిచ్చిన ఉదయనిధి వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో బాలు ఈ వ్యాఖ్య చేశారు.
సోమవారం జరిగిన ‘ముప్పెరుం విజా 2023’ కార్యక్రమంలో బాలు మాట్లాడుతూ.. డీఎంకే యువజన విభాగం అధినేతను చూసి దేశం మొత్తం భయపడుతోందని, ఆయన తర్వాత ఏమి చేస్తారోనని ఆలోచిస్తున్నారన్నారు. దేశం ఆయనను చూసి భయపడుతుంటే ఉదయనిధి తన తండ్రికి మాత్రమే భయపడుతున్నారని ఆయన అన్నారు. ఉదయనిధి స్టాలిన్ తర్వాత తాను అన్నింటిని ఎదుర్కోగలనని భావించే ఏదైనా మాట్లాడుతున్నారని, కానీ తన చేతిలో పట్టుకున్న వస్తువు కిందపడి విరిగిపోకుండా చూసుకోవడం ఆయన కర్తవ్యమని, అది గుర్తుంచుకోవాలని స్టాలిన్ హెచ్చరిస్తున్నానన్నారు.
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
Also Read: Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
ఉదయనిధి వ్యాఖ్యలు వక్రీకరించిన నివేదికలపై ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన నాయకులు మొదట్లో స్పందించారని, కచ్చితమైన మీడియా నివేదికలను చూపించిన తర్వాత మాత్రమే వారు శాంతించారని బాలు ఎత్తి చూపారు. తన ప్రకటనలు అసూయతో వక్రీకరించబడుతున్నాయని, వాటిని గుర్తుంచుకోవాలని ఆయన ఉదయనిధిని హెచ్చరించారు. పెరియార్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల ప్రారంభంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు. దాని నిర్మూలన కోసం పిలుపునిచ్చారు. సనాతన ధర్మం కుల వ్యవస్థ, వివక్షపై ఆధారపడి ఉందని డీఎంకే మంత్రి వాదించారు. “సనాతనాన్ని వ్యతిరేకించడం కంటే, దానిని నిర్మూలించాలి. సనాతన అనే పేరు సంస్కృతం నుంచి వచ్చింది. ఇది సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధం” అని మంత్రి అన్నారు. ఉదయనిధి సోషల్ మీడియాలో మస్కిటో కాయిల్ చిత్రాన్ని పోస్ట్ చేసి మంటలను పెంచారు. ఇది జాతీయ స్థాయిలో పెద్ద రాజకీయ వివాదానికి దారితీసిన తర్వాత కూడా, ఉదయనిధి తన మాటలకు కట్టుబడి ఉన్నానని, తన వ్యాఖ్యలను మారణహోమానికి పిలుపుగా తప్పుడు చిత్రీకరించారని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!