DMK MP TR Baalu: మంత్రి ఉదయనిధి స్టాలిన్కు డీఎంకే ఎంపీ హెచ్చరిక.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK MP TR Baalu: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కోశాధికారి మరియు ఎంపీ టీఆర్ బాలు, డీఎంకే యువజన విభాగం అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు హెచ్చరిక నోట్ జారీ చేశారు. తన రాజకీయ జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కోరారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చి, దాని నిర్మూలనకు పిలుపునిచ్చిన ఉదయనిధి వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో బాలు ఈ వ్యాఖ్య చేశారు.
సోమవారం జరిగిన ‘ముప్పెరుం విజా 2023’ కార్యక్రమంలో బాలు మాట్లాడుతూ.. డీఎంకే యువజన విభాగం అధినేతను చూసి దేశం మొత్తం భయపడుతోందని, ఆయన తర్వాత ఏమి చేస్తారోనని ఆలోచిస్తున్నారన్నారు. దేశం ఆయనను చూసి భయపడుతుంటే ఉదయనిధి తన తండ్రికి మాత్రమే భయపడుతున్నారని ఆయన అన్నారు. ఉదయనిధి స్టాలిన్ తర్వాత తాను అన్నింటిని ఎదుర్కోగలనని భావించే ఏదైనా మాట్లాడుతున్నారని, కానీ తన చేతిలో పట్టుకున్న వస్తువు కిందపడి విరిగిపోకుండా చూసుకోవడం ఆయన కర్తవ్యమని, అది గుర్తుంచుకోవాలని స్టాలిన్ హెచ్చరిస్తున్నానన్నారు.
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
Also Read: Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
ఉదయనిధి వ్యాఖ్యలు వక్రీకరించిన నివేదికలపై ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన నాయకులు మొదట్లో స్పందించారని, కచ్చితమైన మీడియా నివేదికలను చూపించిన తర్వాత మాత్రమే వారు శాంతించారని బాలు ఎత్తి చూపారు. తన ప్రకటనలు అసూయతో వక్రీకరించబడుతున్నాయని, వాటిని గుర్తుంచుకోవాలని ఆయన ఉదయనిధిని హెచ్చరించారు. పెరియార్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల ప్రారంభంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు. దాని నిర్మూలన కోసం పిలుపునిచ్చారు. సనాతన ధర్మం కుల వ్యవస్థ, వివక్షపై ఆధారపడి ఉందని డీఎంకే మంత్రి వాదించారు. “సనాతనాన్ని వ్యతిరేకించడం కంటే, దానిని నిర్మూలించాలి. సనాతన అనే పేరు సంస్కృతం నుంచి వచ్చింది. ఇది సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధం” అని మంత్రి అన్నారు. ఉదయనిధి సోషల్ మీడియాలో మస్కిటో కాయిల్ చిత్రాన్ని పోస్ట్ చేసి మంటలను పెంచారు. ఇది జాతీయ స్థాయిలో పెద్ద రాజకీయ వివాదానికి దారితీసిన తర్వాత కూడా, ఉదయనిధి తన మాటలకు కట్టుబడి ఉన్నానని, తన వ్యాఖ్యలను మారణహోమానికి పిలుపుగా తప్పుడు చిత్రీకరించారని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!