DMK MP TR Baalu: మంత్రి ఉదయనిధి స్టాలిన్కు డీఎంకే ఎంపీ హెచ్చరిక.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK MP TR Baalu: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కోశాధికారి మరియు ఎంపీ టీఆర్ బాలు, డీఎంకే యువజన విభాగం అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు హెచ్చరిక నోట్ జారీ చేశారు. తన రాజకీయ జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కోరారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చి, దాని నిర్మూలనకు పిలుపునిచ్చిన ఉదయనిధి వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో బాలు ఈ వ్యాఖ్య చేశారు.
సోమవారం జరిగిన ‘ముప్పెరుం విజా 2023’ కార్యక్రమంలో బాలు మాట్లాడుతూ.. డీఎంకే యువజన విభాగం అధినేతను చూసి దేశం మొత్తం భయపడుతోందని, ఆయన తర్వాత ఏమి చేస్తారోనని ఆలోచిస్తున్నారన్నారు. దేశం ఆయనను చూసి భయపడుతుంటే ఉదయనిధి తన తండ్రికి మాత్రమే భయపడుతున్నారని ఆయన అన్నారు. ఉదయనిధి స్టాలిన్ తర్వాత తాను అన్నింటిని ఎదుర్కోగలనని భావించే ఏదైనా మాట్లాడుతున్నారని, కానీ తన చేతిలో పట్టుకున్న వస్తువు కిందపడి విరిగిపోకుండా చూసుకోవడం ఆయన కర్తవ్యమని, అది గుర్తుంచుకోవాలని స్టాలిన్ హెచ్చరిస్తున్నానన్నారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Also Read: Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
ఉదయనిధి వ్యాఖ్యలు వక్రీకరించిన నివేదికలపై ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన నాయకులు మొదట్లో స్పందించారని, కచ్చితమైన మీడియా నివేదికలను చూపించిన తర్వాత మాత్రమే వారు శాంతించారని బాలు ఎత్తి చూపారు. తన ప్రకటనలు అసూయతో వక్రీకరించబడుతున్నాయని, వాటిని గుర్తుంచుకోవాలని ఆయన ఉదయనిధిని హెచ్చరించారు. పెరియార్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల ప్రారంభంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు. దాని నిర్మూలన కోసం పిలుపునిచ్చారు. సనాతన ధర్మం కుల వ్యవస్థ, వివక్షపై ఆధారపడి ఉందని డీఎంకే మంత్రి వాదించారు. “సనాతనాన్ని వ్యతిరేకించడం కంటే, దానిని నిర్మూలించాలి. సనాతన అనే పేరు సంస్కృతం నుంచి వచ్చింది. ఇది సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధం” అని మంత్రి అన్నారు. ఉదయనిధి సోషల్ మీడియాలో మస్కిటో కాయిల్ చిత్రాన్ని పోస్ట్ చేసి మంటలను పెంచారు. ఇది జాతీయ స్థాయిలో పెద్ద రాజకీయ వివాదానికి దారితీసిన తర్వాత కూడా, ఉదయనిధి తన మాటలకు కట్టుబడి ఉన్నానని, తన వ్యాఖ్యలను మారణహోమానికి పిలుపుగా తప్పుడు చిత్రీకరించారని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!