DMK MP TR Baalu: మంత్రి ఉదయనిధి స్టాలిన్కు డీఎంకే ఎంపీ హెచ్చరిక.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK MP TR Baalu: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కోశాధికారి మరియు ఎంపీ టీఆర్ బాలు, డీఎంకే యువజన విభాగం అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు హెచ్చరిక నోట్ జారీ చేశారు. తన రాజకీయ జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కోరారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చి, దాని నిర్మూలనకు పిలుపునిచ్చిన ఉదయనిధి వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో బాలు ఈ వ్యాఖ్య చేశారు.
సోమవారం జరిగిన ‘ముప్పెరుం విజా 2023’ కార్యక్రమంలో బాలు మాట్లాడుతూ.. డీఎంకే యువజన విభాగం అధినేతను చూసి దేశం మొత్తం భయపడుతోందని, ఆయన తర్వాత ఏమి చేస్తారోనని ఆలోచిస్తున్నారన్నారు. దేశం ఆయనను చూసి భయపడుతుంటే ఉదయనిధి తన తండ్రికి మాత్రమే భయపడుతున్నారని ఆయన అన్నారు. ఉదయనిధి స్టాలిన్ తర్వాత తాను అన్నింటిని ఎదుర్కోగలనని భావించే ఏదైనా మాట్లాడుతున్నారని, కానీ తన చేతిలో పట్టుకున్న వస్తువు కిందపడి విరిగిపోకుండా చూసుకోవడం ఆయన కర్తవ్యమని, అది గుర్తుంచుకోవాలని స్టాలిన్ హెచ్చరిస్తున్నానన్నారు.
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
Also Read: Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
ఉదయనిధి వ్యాఖ్యలు వక్రీకరించిన నివేదికలపై ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన నాయకులు మొదట్లో స్పందించారని, కచ్చితమైన మీడియా నివేదికలను చూపించిన తర్వాత మాత్రమే వారు శాంతించారని బాలు ఎత్తి చూపారు. తన ప్రకటనలు అసూయతో వక్రీకరించబడుతున్నాయని, వాటిని గుర్తుంచుకోవాలని ఆయన ఉదయనిధిని హెచ్చరించారు. పెరియార్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల ప్రారంభంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు. దాని నిర్మూలన కోసం పిలుపునిచ్చారు. సనాతన ధర్మం కుల వ్యవస్థ, వివక్షపై ఆధారపడి ఉందని డీఎంకే మంత్రి వాదించారు. “సనాతనాన్ని వ్యతిరేకించడం కంటే, దానిని నిర్మూలించాలి. సనాతన అనే పేరు సంస్కృతం నుంచి వచ్చింది. ఇది సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధం” అని మంత్రి అన్నారు. ఉదయనిధి సోషల్ మీడియాలో మస్కిటో కాయిల్ చిత్రాన్ని పోస్ట్ చేసి మంటలను పెంచారు. ఇది జాతీయ స్థాయిలో పెద్ద రాజకీయ వివాదానికి దారితీసిన తర్వాత కూడా, ఉదయనిధి తన మాటలకు కట్టుబడి ఉన్నానని, తన వ్యాఖ్యలను మారణహోమానికి పిలుపుగా తప్పుడు చిత్రీకరించారని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?