DK Aruna : మిషన్ కాకతీయ పేరుతో కమీషన్ల కాకతీయగా మార్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజమాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పేరుతో కమీషన్ల కాకతీయగా మార్చారని మండిపడ్డారు. చెరువుల అభివృద్ధి పేరుతో నాసిరకంగా పనులు చేపట్టారని, మంత్రి ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో నాణ్యత పాటించక పోవడ వల్లే చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. నాసిరకంగా పనులు చేపట్టి కమిషన్లతో డబ్బులు వెనక్కి వేసుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గరకు వచ్చింది లేదు, పరామర్శ చేసిన పాపాన పోలేదన్నారు.
Also Read : ABHB: ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.21 వేలు ప్రకటించిన ప్రభుత్వం
Also Read
మోతే సమీపంలో చెక్ డ్యాంల నిర్మాణాల లోపాల వల్లే వందలాది ఎకరాలు నిట మునిగాయని, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చిలెనోడు దేశ ప్రజల కష్టాలు తిరుస్తాడా..? అని ఆమె ప్రశ్నించారు. మంత్రి భరోసా ఇవ్వడం లేడు, సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు పట్టించు కోవడం లేదని, రైతుల నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, నష్టపరిహారం వెంటనే అందించాలన్నారు. ఇసుక మేటలు వేసిన పంట పొలాలను సాగుకు యోగ్యంగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన డీకే. అరుణ ఆరోపించారు.
Also Read : Eye Flu: రాజధానిలో బీభత్సం సృష్టిస్తోన్న కండ్లకలక.. ఆసుపత్రుల్లో పెరిగిన రద్దీ
అంతేకాకుండా.. రాష్ట్రం లో రైతు ససమస్యల పై అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. భారీ వర్షాల తో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నారని, సీఎం దత్తత గ్రామం మోతె లో చెక్ డ్యాం ల నిర్మాణం లో అనేక అక్రమాలు జరిగాయన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కమీషన్లు కోసం చెక్ డ్యాం ల నిర్మాణం చేశారని, వర్షాల తో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులను పరామర్శించే దిక్కు లేదన్నారు. సీఎం, మంత్రులు ఇంజనీర్లు గా వ్యవహరిస్తున్నారని, భారీ వర్షాల తో పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల పరిహారం అందించాలన్నారు. నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఇల్లు కూలిపోయిన బాధితులకు తక్షణ సహాయం కింద 10 వేలు ఇవ్వాలన్నారు డీకే అరుణ. ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్ కు ఓటు అడిగే హక్కు ఎక్కడిది..? సీఎం తన దత్తత గ్రామం మోతే కు వచ్చి రైతుల కష్టాన్ని తెలుసుకోవాలని డీకే. అరుణ అన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!