Diwali Fireworks Sales: రూ.7 వేల కోట్లు దాటిన బాణసంచా అమ్మకాలు.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Fireworks Sales: దేశ వ్యాప్తంగా దీపావళి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బాణసంచా అమ్మకాలు జరిగాయి. బాణసంచా వ్యాపారుల సమాఖ్య నివేదికల ప్రకారం.. పండుగ సీజన్లో సుమారు రూ.7 వేల కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం రూ.6 వేల కోట్ల టర్నోవర్తో పోలిస్తే, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల పెరుగుదల నమోదు అయ్యింది.
READ ALSO: Fraud: ఐటీ మినిష్టర్ పేషీ పేరుతో రూ. 1.77 కోట్ల మోసం.. సీసీఎస్ పోలీసుల దర్యాప్తు..
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ప్రధాన బాణసంచా తయారీ కేంద్రాలు (తమిళనాడులోని శివకాశి, విరుదునగర్, సత్తూరు) పెద్ద సంఖ్యలో జనం రావడంతో కిటకిటలాడాయి. పండుగకు ముందే దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు ఈ నగరాలకు తరలి వచ్చారని వ్యాపారులు పేర్కొన్నారు. పర్యావరణ పరిమితులు, కొవిడ్ మహమ్మారి కారణంగా కొన్ని సంవత్సరాలుగా కొనుగోలు మందగించిందని, దీని తర్వాత కొత్త ఉత్సాహాన్ని చూస్తున్నామని వ్యాపారులు వెల్లడించారు. ఈ ఏడాది పండుగకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయని చెప్పారు.
కొత్త రకం బాణసంచా..
పిజ్జా, పుచ్చకాయ వంటి కొత్త రకాల బాణసంచా పరిచయం ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించిందని వ్యాపారులు చెప్పారు. ఇటువంటి కొత్త ఉత్పత్తులకు ఉన్న బలమైన డిమాండ్ మొత్తం అమ్మకాలను పెంచడానికి సహాయపడిందని తయారీదారులు తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించడం వల్ల అమ్మకాలు పెరిగాయని బాణసంచా వ్యాపారుల సమాఖ్య పేర్కొంది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా పూర్తి నిషేధం అమలులో ఉన్న ఢిల్లీలో ఇటీవల కోర్టు అనుమతితో పచ్చని బాణసంచా కాల్చడానికి దేశవ్యాప్తంగా డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు.
దేశ బాణసంచా రాజధానిగా ప్రత్యేక గుర్తింపు పొందిన శివకాశి వేలాది మంది బాణాసంచా కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. దేశంలో బాణసంచా ఉత్పత్తిలో దాదాపు 90 శాతం వాటాను ఈ ప్రాంతం కలిగి ఉంది. పర్యావరణ సమస్యలు, నియంత్రణ అడ్డంకుల కారణంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఈ సంవత్సరం పండుగ చాలా అవసరమైన ఉపశమనం కలిగించిందని వ్యాపారులు పేర్కొన్నారు. 2025 దీపావళి పండుగ తమ కుటుంబాల్లో ప్రత్యేక వెలుగులను నింపిందని బాణసంచా సమాఖ్య పేర్కొంది .
READ ALSO: San Francisco: అమెరికాలో కలకలం – శాన్ ఫ్రాన్సిస్కోలో సైనిక దళాల మోహరింపు!
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?