Diwali Fireworks Sales: రూ.7 వేల కోట్లు దాటిన బాణసంచా అమ్మకాలు.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Fireworks Sales: దేశ వ్యాప్తంగా దీపావళి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బాణసంచా అమ్మకాలు జరిగాయి. బాణసంచా వ్యాపారుల సమాఖ్య నివేదికల ప్రకారం.. పండుగ సీజన్లో సుమారు రూ.7 వేల కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం రూ.6 వేల కోట్ల టర్నోవర్తో పోలిస్తే, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల పెరుగుదల నమోదు అయ్యింది.
READ ALSO: Fraud: ఐటీ మినిష్టర్ పేషీ పేరుతో రూ. 1.77 కోట్ల మోసం.. సీసీఎస్ పోలీసుల దర్యాప్తు..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ప్రధాన బాణసంచా తయారీ కేంద్రాలు (తమిళనాడులోని శివకాశి, విరుదునగర్, సత్తూరు) పెద్ద సంఖ్యలో జనం రావడంతో కిటకిటలాడాయి. పండుగకు ముందే దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు ఈ నగరాలకు తరలి వచ్చారని వ్యాపారులు పేర్కొన్నారు. పర్యావరణ పరిమితులు, కొవిడ్ మహమ్మారి కారణంగా కొన్ని సంవత్సరాలుగా కొనుగోలు మందగించిందని, దీని తర్వాత కొత్త ఉత్సాహాన్ని చూస్తున్నామని వ్యాపారులు వెల్లడించారు. ఈ ఏడాది పండుగకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయని చెప్పారు.
కొత్త రకం బాణసంచా..
పిజ్జా, పుచ్చకాయ వంటి కొత్త రకాల బాణసంచా పరిచయం ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించిందని వ్యాపారులు చెప్పారు. ఇటువంటి కొత్త ఉత్పత్తులకు ఉన్న బలమైన డిమాండ్ మొత్తం అమ్మకాలను పెంచడానికి సహాయపడిందని తయారీదారులు తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించడం వల్ల అమ్మకాలు పెరిగాయని బాణసంచా వ్యాపారుల సమాఖ్య పేర్కొంది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా పూర్తి నిషేధం అమలులో ఉన్న ఢిల్లీలో ఇటీవల కోర్టు అనుమతితో పచ్చని బాణసంచా కాల్చడానికి దేశవ్యాప్తంగా డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు.
దేశ బాణసంచా రాజధానిగా ప్రత్యేక గుర్తింపు పొందిన శివకాశి వేలాది మంది బాణాసంచా కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. దేశంలో బాణసంచా ఉత్పత్తిలో దాదాపు 90 శాతం వాటాను ఈ ప్రాంతం కలిగి ఉంది. పర్యావరణ సమస్యలు, నియంత్రణ అడ్డంకుల కారణంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఈ సంవత్సరం పండుగ చాలా అవసరమైన ఉపశమనం కలిగించిందని వ్యాపారులు పేర్కొన్నారు. 2025 దీపావళి పండుగ తమ కుటుంబాల్లో ప్రత్యేక వెలుగులను నింపిందని బాణసంచా సమాఖ్య పేర్కొంది .
READ ALSO: San Francisco: అమెరికాలో కలకలం – శాన్ ఫ్రాన్సిస్కోలో సైనిక దళాల మోహరింపు!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?