Diwali Fireworks Sales: రూ.7 వేల కోట్లు దాటిన బాణసంచా అమ్మకాలు.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Fireworks Sales: దేశ వ్యాప్తంగా దీపావళి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బాణసంచా అమ్మకాలు జరిగాయి. బాణసంచా వ్యాపారుల సమాఖ్య నివేదికల ప్రకారం.. పండుగ సీజన్లో సుమారు రూ.7 వేల కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం రూ.6 వేల కోట్ల టర్నోవర్తో పోలిస్తే, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల పెరుగుదల నమోదు అయ్యింది.
READ ALSO: Fraud: ఐటీ మినిష్టర్ పేషీ పేరుతో రూ. 1.77 కోట్ల మోసం.. సీసీఎస్ పోలీసుల దర్యాప్తు..
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ప్రధాన బాణసంచా తయారీ కేంద్రాలు (తమిళనాడులోని శివకాశి, విరుదునగర్, సత్తూరు) పెద్ద సంఖ్యలో జనం రావడంతో కిటకిటలాడాయి. పండుగకు ముందే దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు ఈ నగరాలకు తరలి వచ్చారని వ్యాపారులు పేర్కొన్నారు. పర్యావరణ పరిమితులు, కొవిడ్ మహమ్మారి కారణంగా కొన్ని సంవత్సరాలుగా కొనుగోలు మందగించిందని, దీని తర్వాత కొత్త ఉత్సాహాన్ని చూస్తున్నామని వ్యాపారులు వెల్లడించారు. ఈ ఏడాది పండుగకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయని చెప్పారు.
కొత్త రకం బాణసంచా..
పిజ్జా, పుచ్చకాయ వంటి కొత్త రకాల బాణసంచా పరిచయం ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించిందని వ్యాపారులు చెప్పారు. ఇటువంటి కొత్త ఉత్పత్తులకు ఉన్న బలమైన డిమాండ్ మొత్తం అమ్మకాలను పెంచడానికి సహాయపడిందని తయారీదారులు తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించడం వల్ల అమ్మకాలు పెరిగాయని బాణసంచా వ్యాపారుల సమాఖ్య పేర్కొంది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా పూర్తి నిషేధం అమలులో ఉన్న ఢిల్లీలో ఇటీవల కోర్టు అనుమతితో పచ్చని బాణసంచా కాల్చడానికి దేశవ్యాప్తంగా డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు.
దేశ బాణసంచా రాజధానిగా ప్రత్యేక గుర్తింపు పొందిన శివకాశి వేలాది మంది బాణాసంచా కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. దేశంలో బాణసంచా ఉత్పత్తిలో దాదాపు 90 శాతం వాటాను ఈ ప్రాంతం కలిగి ఉంది. పర్యావరణ సమస్యలు, నియంత్రణ అడ్డంకుల కారణంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఈ సంవత్సరం పండుగ చాలా అవసరమైన ఉపశమనం కలిగించిందని వ్యాపారులు పేర్కొన్నారు. 2025 దీపావళి పండుగ తమ కుటుంబాల్లో ప్రత్యేక వెలుగులను నింపిందని బాణసంచా సమాఖ్య పేర్కొంది .
READ ALSO: San Francisco: అమెరికాలో కలకలం – శాన్ ఫ్రాన్సిస్కోలో సైనిక దళాల మోహరింపు!
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!