Diwali Fireworks Sales: రూ.7 వేల కోట్లు దాటిన బాణసంచా అమ్మకాలు.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Fireworks Sales: దేశ వ్యాప్తంగా దీపావళి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా రికార్డు స్థాయిలో బాణసంచా అమ్మకాలు జరిగాయి. బాణసంచా వ్యాపారుల సమాఖ్య నివేదికల ప్రకారం.. పండుగ సీజన్లో సుమారు రూ.7 వేల కోట్ల విలువైన బాణసంచా అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం రూ.6 వేల కోట్ల టర్నోవర్తో పోలిస్తే, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల పెరుగుదల నమోదు అయ్యింది.
READ ALSO: Fraud: ఐటీ మినిష్టర్ పేషీ పేరుతో రూ. 1.77 కోట్ల మోసం.. సీసీఎస్ పోలీసుల దర్యాప్తు..
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ప్రధాన బాణసంచా తయారీ కేంద్రాలు (తమిళనాడులోని శివకాశి, విరుదునగర్, సత్తూరు) పెద్ద సంఖ్యలో జనం రావడంతో కిటకిటలాడాయి. పండుగకు ముందే దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు ఈ నగరాలకు తరలి వచ్చారని వ్యాపారులు పేర్కొన్నారు. పర్యావరణ పరిమితులు, కొవిడ్ మహమ్మారి కారణంగా కొన్ని సంవత్సరాలుగా కొనుగోలు మందగించిందని, దీని తర్వాత కొత్త ఉత్సాహాన్ని చూస్తున్నామని వ్యాపారులు వెల్లడించారు. ఈ ఏడాది పండుగకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయని చెప్పారు.
కొత్త రకం బాణసంచా..
పిజ్జా, పుచ్చకాయ వంటి కొత్త రకాల బాణసంచా పరిచయం ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించిందని వ్యాపారులు చెప్పారు. ఇటువంటి కొత్త ఉత్పత్తులకు ఉన్న బలమైన డిమాండ్ మొత్తం అమ్మకాలను పెంచడానికి సహాయపడిందని తయారీదారులు తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించడం వల్ల అమ్మకాలు పెరిగాయని బాణసంచా వ్యాపారుల సమాఖ్య పేర్కొంది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా పూర్తి నిషేధం అమలులో ఉన్న ఢిల్లీలో ఇటీవల కోర్టు అనుమతితో పచ్చని బాణసంచా కాల్చడానికి దేశవ్యాప్తంగా డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు.
దేశ బాణసంచా రాజధానిగా ప్రత్యేక గుర్తింపు పొందిన శివకాశి వేలాది మంది బాణాసంచా కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. దేశంలో బాణసంచా ఉత్పత్తిలో దాదాపు 90 శాతం వాటాను ఈ ప్రాంతం కలిగి ఉంది. పర్యావరణ సమస్యలు, నియంత్రణ అడ్డంకుల కారణంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న పరిశ్రమకు ఈ సంవత్సరం పండుగ చాలా అవసరమైన ఉపశమనం కలిగించిందని వ్యాపారులు పేర్కొన్నారు. 2025 దీపావళి పండుగ తమ కుటుంబాల్లో ప్రత్యేక వెలుగులను నింపిందని బాణసంచా సమాఖ్య పేర్కొంది .
READ ALSO: San Francisco: అమెరికాలో కలకలం – శాన్ ఫ్రాన్సిస్కోలో సైనిక దళాల మోహరింపు!
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!