AP Assembly: అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు.. టీడీఆర్ బాండ్లపై చర్చ
- ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు
- టీడీఆర్ బాండ్లపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. టీడీఆర్ బాండ్లపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకూ 3306 టీడీఆర్ బాండ్స్ ఇచ్చారని.. దీనిపై శాఖాపరమైన చర్యలు, ఏసీబీ విచారణకు ఆదేశించామన్నారు. ఏసీబీ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని.. తణుకులో ముగ్గురు అధికారులను ఈ వ్యవహరంలో సస్పెండ్ చేశామన్నారు.
Read Also: Madanapalle Incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనలో 37 మందిని విచారించనున్న పోలీసులు
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
టీడీఆర్ బాండ్ల వెనుకున్న వ్యక్తులు ఎవరనేది మనందరికి తెలుసని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. తణుకు పురపాలక సంఘంలో 61 బాండ్లు జారీ చేశారని.. దీని విలువ తీసుకుంటే టీడీపీ హాయంలో 6000 గజాలకు మాత్రమే బాండ్లు ఇచ్చామన్నారు. గతంలో సంవత్సర కాలంలోనే 1 లక్ష, 48వేల 400 గజాలు వరకూ బాండ్లు ఇచ్చారన్నారు. జగనన్న కాలనీ పేరుతో 25 కోట్లకు బాండ్లు ఇష్యూ చేశారని చెప్పారు. ఈమొత్తం వ్యవహరంలో సూత్రధారి ఎవ్వరో తేల్చారా లేక అధికారులపై చర్యలు మాత్రమేనా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ భూములన్నీ సంవత్సర కాలంలోనే చేతులు మారాయని, రిజిస్ట్రేషన్లు చేశారని పేర్కొన్నారు. ఈ భూముల పరిస్ధితి తెలియజేయాలని కోరుతున్నామని మంత్రి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో భాగంగా అడిగారు. టీడీఆర్ బాండ్ల విషయంలో సూత్రధారులు, పాత్ర ధారులపై చర్యలు తీసుకోవాలని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య డిమాండే చేశారు. విశాఖలో మాడిఫికేషన్ను ఆసరాగా తీసుకొని రెస్ట్రిక్టడ్ జోన్లకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. విశాఖపట్నం మెయిన్ రోడ్డు మీద సీబీసీఎన్సీ అనే క్రిష్టియన్ మైనార్టీ సంస్ధ ఉందని.. ఈ రోడ్డుకు 60 కోట్ల టీడీఆర్ బాండ్ల ఇష్యూ చేశారని అన్నారు. ఈ విషయంలో చిన్న బిల్డర్లను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళారని తెలిపారు.
ఈ ప్రశ్నలకు పురపాల శాఖ మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. తణుకులో టీడీఆర్ బాండ్లు 29 ఇచ్చారని.. 4500 స్క్వేర్ యార్డు ఉంటే 1.4 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇంటిని చూపించి అక్కడి రేటు పెంచారన్నారు. దీంతో దీని విలువ అసాధారణంగా పెరిగిందన్నారు. 63.24లక్షలకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాల్సి ఉండగా 754 కోట్ల 67 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై 691కోట్ల 43 లక్షల స్కాం తణుకులో గుర్తించామని చెప్పారు. నాలుగు ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఇచ్చిన బాండ్లు కంప్లీటుగా రిలీజ్ చేయొద్దని చెప్పామన్నారు. రిపోర్టు రాగానే యాక్షన్ తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!