Ka Paul: దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ నాపై పోటీ చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నానని.. తనను గెలిపించండని కోరారు. తనను ఓడించడానికి పురందేశ్వరికి, జీవీఎల్ కు రూ. 1200 కోట్లు ఖర్చు చేయమని మోడీ చెప్పారని తెలిపారు. మరోవైపు.. వైజాగ్ లో వెయ్యి కోట్లు ఖర్చుచేసి తనను ఓడించాలని బొత్స సత్యనారాయణ చూస్తున్నాడని ఆరోపించారు. దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ తనపై వైజాగ్ లో పోటీ చేయాలని సవాల్ చేశారు. రెండు నెలల క్రితం జేడీ లక్ష్మీనారాయణను కలిశానని.. జేడీని తనతో కలిసి రమ్మని అడిగినట్లు పేర్కొన్నారు. కానీ ఆయన తనను వెయ్యి కోట్లు అడిగారని కేఏ పాల్ చెప్పారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేఏ పాల్ అన్నారు. బాలయోగికి ఎందుకు భారతరత్న ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు. తనకు భారతరత్న ఇస్తానన్నారు.. కానీ తానే తీసుకోలేదని చెప్పారు. మరోవైపు పవన్ కల్యాణ్ కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ నీకెందుకు ఈ ఖర్మ.. మెగా బ్రదర్స్ ప్రజారాజ్యం పేరుతో మంచి పార్టీ పెట్టారు. అందర్నీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో కలిపేశారని విమర్శించారు. 20 సీట్లు తీసుకోవడానికి మేం కుక్కలమా అన్నావని.. మరెందుకు ఇప్పుడు పాతిక సీట్ల కోసం పాకులాడుతున్నావ్..? అని ప్రశ్నించారు. చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాబట్టే పద్మభూషణ్ , పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకు బిల్ గేట్సును పరిచయం చేసింది తానేనన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ నిజాన్ని ప్రజలకు చెప్పాలని తెలిపారు.
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మరోవైపు.. తనను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ తనను కొట్టించారన్నారు. వారు చిత్తుచిత్తుగా ఓడిపోతారని చెప్పా ఎన్నికల్లో ఓడిపోయారని పేర్కొన్నారు. తనకు చావంటే భయం లేదని.. చావుకే తానంటే భయమని అన్నారు. ఏపీలో పార్టీలన్నీ మోడీ తొత్తులేనని విమర్శించారు. పురందేశ్వరి చాలా మంచి వ్యక్తి.. ఆమె కూడా మోడీకి అమ్ముడు పోయిందని ఆరోపించారు. చంద్రబాబు మంచి హీరో అనుకున్నానని.. చంద్రబాబు జైలుకెళ్లాక ఆయనపై 60 కేసులున్నాయని తెలిసిందని అన్నారు. 60 కేసులున్నాయి కాబట్టే.. మళ్లీ జైల్లో పెడతారానే భయంతో చంద్రబాబు అమిత్ షాను కలిశాడని కేఏ పాల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..