Ka Paul: దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ నాపై పోటీ చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నానని.. తనను గెలిపించండని కోరారు. తనను ఓడించడానికి పురందేశ్వరికి, జీవీఎల్ కు రూ. 1200 కోట్లు ఖర్చు చేయమని మోడీ చెప్పారని తెలిపారు. మరోవైపు.. వైజాగ్ లో వెయ్యి కోట్లు ఖర్చుచేసి తనను ఓడించాలని బొత్స సత్యనారాయణ చూస్తున్నాడని ఆరోపించారు. దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ తనపై వైజాగ్ లో పోటీ చేయాలని సవాల్ చేశారు. రెండు నెలల క్రితం జేడీ లక్ష్మీనారాయణను కలిశానని.. జేడీని తనతో కలిసి రమ్మని అడిగినట్లు పేర్కొన్నారు. కానీ ఆయన తనను వెయ్యి కోట్లు అడిగారని కేఏ పాల్ చెప్పారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేఏ పాల్ అన్నారు. బాలయోగికి ఎందుకు భారతరత్న ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు. తనకు భారతరత్న ఇస్తానన్నారు.. కానీ తానే తీసుకోలేదని చెప్పారు. మరోవైపు పవన్ కల్యాణ్ కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ నీకెందుకు ఈ ఖర్మ.. మెగా బ్రదర్స్ ప్రజారాజ్యం పేరుతో మంచి పార్టీ పెట్టారు. అందర్నీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో కలిపేశారని విమర్శించారు. 20 సీట్లు తీసుకోవడానికి మేం కుక్కలమా అన్నావని.. మరెందుకు ఇప్పుడు పాతిక సీట్ల కోసం పాకులాడుతున్నావ్..? అని ప్రశ్నించారు. చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాబట్టే పద్మభూషణ్ , పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకు బిల్ గేట్సును పరిచయం చేసింది తానేనన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఈ నిజాన్ని ప్రజలకు చెప్పాలని తెలిపారు.
Also Read
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
మరోవైపు.. తనను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ తనను కొట్టించారన్నారు. వారు చిత్తుచిత్తుగా ఓడిపోతారని చెప్పా ఎన్నికల్లో ఓడిపోయారని పేర్కొన్నారు. తనకు చావంటే భయం లేదని.. చావుకే తానంటే భయమని అన్నారు. ఏపీలో పార్టీలన్నీ మోడీ తొత్తులేనని విమర్శించారు. పురందేశ్వరి చాలా మంచి వ్యక్తి.. ఆమె కూడా మోడీకి అమ్ముడు పోయిందని ఆరోపించారు. చంద్రబాబు మంచి హీరో అనుకున్నానని.. చంద్రబాబు జైలుకెళ్లాక ఆయనపై 60 కేసులున్నాయని తెలిసిందని అన్నారు. 60 కేసులున్నాయి కాబట్టే.. మళ్లీ జైల్లో పెడతారానే భయంతో చంద్రబాబు అమిత్ షాను కలిశాడని కేఏ పాల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!