బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. బుధవారం సాయంత్రం షోస్ తో రిలీజ్ అయినా ఈ సినిమా యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో సంచలనాలు నమోదు చేస్తుంది ధురంధర్. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ నుండే రరికార్డులు వేట స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫారమ్ ‘బుక్ మై షో’ (BMS)లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
Also Read : SRK : యాక్షన్ జోనర్కు బ్రేక్.. రొమాంటిక్ ఫిల్మ్ చేసే యోచనలో కింగ్ ఖాన్
తాజా సమాచారం ప్రకారం, ‘ధురంధర్ 2’ చిత్రం గంటల వారీ ట్రెండ్స్లో (109.17K)బుకింగ్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్’ ( 107.65K) రికార్డును సైతం అధిగమించింది. ఒక పక్క తెలుగు వెర్షన్ షోలు రద్దు కావడం మరోపక్క సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రణవీర్ సింగ్ క్రేజ్ ముందు అవేవీ అడ్డుకాలేవని ఈ ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి. సినిమాపై ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నిజానికి తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కంటెంట్ సకాలంలో అందకపోవడం వల్ల ఈ చిత్రం తన పూర్తి స్థాయి వసూళ్లను సాధించే అవకాశాన్ని కొంతవరకు కోల్పోయింది. ఒకవేళ మొదటి రోజు నుండే అన్ని వెర్షన్లలో భారీగా విడుదలై ఉంటే ఈ రికార్డులు మరింత భారీగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ‘ధురంధర్ 2’ ఇంతటి మాసివ్ క్రేజ్ను సొంతం చేసుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
