Dharmapuri Sanjay : మా నాన్న రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలు నిర్ణయిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీని కలిశారు. ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. మా నాన్న రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. కడుపున పుట్టినంత మాత్రాన రాజకీయ వారసత్వం రాదని ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ లో మా నాన్న డీఎస్ చేరినప్పుడు, ఓ అనుచరుడు గా మా నాన్న తో కలిసి వెళ్ళానని, ఏ రోజూ బీఆర్ఎస్ లో క్రీయశీలకంగా పనిచేయలేదన్నారు సంజయ్. నేను పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని ఆయన వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నన్ను కూడా సస్పెండ్ చేసిందని, నేనెప్పుడు కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Nenu Super Woman: ”ఆహా” అనిపిస్తున్న ”నేను సూపర్ ఉమన్”..3 వారాల్లో 3 కోట్ల 90 లక్షల పెట్టుబడులు
Also Read
- Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్పై రూ.2 వేల పెరుగుదల!
- Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
సోనియా గాంధీ ని కలిసి ఆశీర్వదించాలని కోరానని, తప్పకుండా ఆశీస్సులు ఉంటాయని సోనియా గాంధీ చెప్పారన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత సోనియా గాంధీ ని ఈరోజు కలిశానని, నిజామాబాద్ మేయర్గా ప్రజల మనసుల్లో ప్రేమ, అభిమానం ఉందని ఆయన అన్నారు. తప్పకుండా ప్రజలు నన్ను ఆదరిస్తారనే విశ్వాసం ఉందని, సోదరుడు అరవింద్ ఎంపీ గా గెలవడానికి అప్పటి పరిస్థితులే కారణమని ఆయన అన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు బాధ్యతలు ఇస్తే తప్పకుండా శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. పార్టీ ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, ఎన్నికల్లో పోటీ చేసే అంశం పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. ఇంకా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను ఈరోజు, రేపు కలుస్తానని ఆయన తెలిపారు.
Also Read : Minister Adimulapu Suresh: గ్రాఫిక్స్ చూపించటం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా?
తాజావార్తలు
-
Rice Price Hike: సన్నబియ్యం ధరల షాక్.. రెండు నెలల్లోనే క్వింటాల్పై రూ.2 వేల పెరుగుదల!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
-
Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
-
Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!