Nayanthara Case: నయనతారపై సివిల్ కేసు నమోదు!
- నయనతారపై సివిల్ కేసు
- మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు
- నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీనే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ నయనతారపై సివిల్ కేసు నమోదైంది. తన పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్ను నెట్ఫ్లిక్స్ రూపొందించి ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో స్టార్ హీరో ధనుష్ కేసు పెట్టారు. నయనతారతో పాటు ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. ఆయన నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్పై కూడా మద్రాస్ హైకోర్టులో కేసు నమోదైంది. ధనుష్ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది.
నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్ మధ్య వివాదం మొదలైంది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని నయన్ అనుకున్నారు. కానీ చిత్ర నిర్మాత ధనుష్ అందుకు ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు అభ్యర్థించినా.. పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఇటీవల నయనతార ఓ బహిరంగ లేఖ పోస్ట్ చేశారు. ధనుష్ నుంచి పర్మిషన్ రానందుకు తాను ఎంతో బాధపడ్డానని, డాక్యుమెంటరీ ట్రైలర్లో మూడు సెకన్ల సీన్స్ ఉపయోగించినందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశారని చెప్పారు. ధనుష్ తనపై ద్వేషం కనబరుస్తున్నారని, మన మనసు గాయపడింది కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నయనతారకు పలువురు మద్దతు తెలిపారు. ఈ విషయంలోనే తాజాగా ధనుష్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నయన్ దంపతులతో పాటు వారి రౌడీ పిక్చర్స్పై సంస్థపై దావా వేసింది.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
Also Read: Allu Arjun Remuneration: షాకింగ్.. 300 కోట్లు ఏంది సామి?
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నయనతార కెరీర్, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలను చూపించారు. విఘ్నేశ్ శివన్తో నయనతార పరిచయం, ప్రేమ, పెళ్లి ఘటనలతో రూపొందించారు. ఇక నానుమ్ రౌడీ దాన్ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్గా నటించారు. ఈ సినిమాను ధనుష్ నిర్మించారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!