స్టార్ హీరోయిన్ నయనతారపై సివిల్ కేసు నమోదైంది. తన పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్ను నెట్ఫ్లిక్స్ రూపొందించి ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో స్టార్ హీరో ధనుష్ కేసు పెట్టారు. నయనతారతో పాటు ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. ఆయన నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్పై కూడా మద్రాస్ హైకోర్టులో కేసు నమోదైంది. ధనుష్ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్…