TG ACB: తెలంగాణ ఏసీబీ సంచలన విషయాలు.. ఈ ఏడాది అవినీతిలో ఆ శాఖలదే పైచేయి..
- ఈ ఏడాది తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఛేదించిన కేసులు
- పట్టుబడ్డ 170 మంది అధికారులు
- అవినీతిలో రెవెన్యూ మళ్లీ అగ్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2024లో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంది. 170 మంది ప్రభుత్వ అధికారులు దుష్ప్రవర్తన, లంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికి పోయారు. ఈ ఏడాది తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఛేదించిన కేసుల వివరాలు, సమాచారాన్ని తాజాగా పంచుకుంది. అవినీతిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖలు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది లంచం తీసుకుంటూ, దుష్ప్రవర్తనకు పాల్పడిన అధికారులు శాఖల వారీగా..
పోలీసు శాఖ: కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు 31 మంది లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
రెవెన్యూ శాఖ : 19 అధికారులు..
రిజిస్ట్రేషన్ శాఖ : 13 అధికారులు..
పంచాయత్ రాజ్ శాఖ: 24 మంది అధికారులు..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఈ ఏడాది ప్రధాన కేసులు: కుషాయిగూడకు చెందిన పోలీసు ఇన్స్పెక్టర్, సబ్-ఇన్స్పెక్టర్ ఓ కేసును క్లోజ్ చేసేందుకు రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ.. పట్టుబడ్డారు. అలాగే.. హైదరాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. రూ. 3 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటూ.. ఏసీబీ అధికారులు చేతికి చిక్కాడు. అప్పటికే రూ. 5 లక్షలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సంగారెడ్డి ఇన్స్పెక్టర్ ఓ కేసులో రూ.1.5 కోట్లు డిమాండ్ చేశాడు. ముందుగా రూ. 5 లక్షలు పుచ్చుకుంటుండగా.. అడ్డంగా దొరికి పోయాడు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఏసీబీ చర్యలు తీసుకుంది. అతని వద్ద 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, బ్రాండెడ్ వాచ్లు, ఐఫోన్లు వంటి విలాసవంతమైన వస్తువులతో సహా రూ. 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వద్ద రూ.100 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. హైదరాబాద్ సీపీఎస్ ఏసీపీ వద్ద రూ. 3.95 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి చర్యలు తీసుకుంది. శామీర్పేట తహశీల్దార్ రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేసి.. రూ.10 లక్షలు నగదు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
నేరారోపణలు:
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఏసీబీ నిందితులుగా తేల్చిన 170 మంది ప్రభుత్వ అధికారుల్లో 12 మంది దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి 1-4 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!