Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేయాలని మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.. డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్
- కాంగ్రెస్ని కనిపించకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్ర
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్.
- స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీ తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని, కానీ రానున్న స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను ఆదరిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాలకు తెలుసునని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పెద్దలు 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తే ప్రణాళికా ప్రకారం వాటిని సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.
Ram Chandra Rao: బీజేపీ బలహీనంగా లేదు.. బలంగా ఉంది.. నెం.1గా మేమే ఉంటాం
Also Read
రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలకు, మనసులకు బాగా తెలుసు అని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ప్రభుత్వం బీసీల దశాబ్దాల కోరికను నెరవేర్చిందని ఆయన అన్నారు. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి సర్వే నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించామన్నారు. ప్రజల కోసం నిలబడిన కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేయాలని బీఆర్ఎస్ నాయకులు మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, కుట్రపూరితంగా కోర్టులకు పంపిస్తున్నారని అన్నారు.
అలాగే ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి హామీలు ఇచ్చి బీఆర్ఎస్ పెద్దలు అమలు చేయలేదు అన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీని 10 సంవత్సరాల్లో కూడా పూర్తిగా చేయలేకపోయారని డిప్యూటీ సీఎం విమర్శించారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాలేశ్వరం కుంగిపోయిందన్నారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చిందన్నారు. యువతకు గ్రూప్ 1, గ్రూప్ 2 తో పాటు ఇప్పటికే 60,000 ఉద్యోగాలు, 21 వేల కోట్ల రైతు రుణమాఫీ, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా, 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్తు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్న ధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్, 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం ఇందుకుగాను 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
అయ్య బాబోయ్.. Abhishek Sharma తక్కువేమి కాదుగా.. ‘ప్రీమియం బౌలర్’ అంటూ ఇచ్చిపడేశాడుగా..
రాష్ట్రంలో 1.05 కోట్ల కుటుంబాలు ఉండగా 96 లక్షల కుటుంబాలకు మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం, బహిరంగ మార్కెట్లో 56 రూపాయలు కిలో ధర పలుకుతున్న సన్నబియ్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏటా 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేసి ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్నాం అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!