Bhatti Vikramarka: కేటీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం ఏర్పాడింది. అధికార కాంగ్రెస్ తో బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో గిరిజన బిడ్డల అమ్మకాలు.. కొడంగల్ నుంచి బొంబాయికు రెండు బస్సులు పోయేవి కాంగ్రెస్ హయాంలో.. మహబూబ్ నగర్ నుంచి వలసలు ఉండేవి.. అందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నాం.. తెలంగాణ తర్వాత ఏమి అయ్యింది చెప్పాలి.. అన్ని విషయాలు తెలంగాణ లో ఏమి అయ్యింది మాట్లాడాలని కేటీఆర్ ప్రశ్నించారు.
Read Also: Cyber Criminals: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. టాస్క్ ల పేరుతో 11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
దీంతో కేటీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు.. ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుని పెద్ద మనసుతో చెప్పామని ఆయన తెలిపారు. దాడి చేయడం మొదలు పెట్టారు.. కేటీఆర్ తీరు సరిగ్గా లేదు.. కాంగ్రెస్ హయాంలో ఎందుకు నీళ్ళు లేవు.. వివరాలు చెప్పా మంటారా? అంటూ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత జనం నీరు తాగలేదా? అంటూ భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Karnataka: మహిళపై దాడి చేసి వివస్త్రను చేసి ఊరేగించిన కేసులో ఇన్ స్పెక్టర్ సస్పెండ్
యాభై ఏండ్లలో ఏం చేశారు అంటారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 55 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రము వద్దనే తెలంగాణ వచ్చింది.. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది లెక్క.. కేంద్రాన్ని ఒప్పించి.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటూ ఆయన మండిపడ్డారు. సంపదతో మేము ఇస్తే.. రాష్ట్రాల అప్పుల పాలు చేశారు అని విమర్శలు గుప్పించారు. అప్పుల రాష్ట్రంగా మార్చింది మీరు.. బాగు చేయాల్సింది పోయి.. అప్పుల పాలు చేశారు.. పాత ముచ్చటే మాట్లాడటం ఏంటి.. లక్షల కోట్లు వృధా చేశారు.. అదనంగా నీళ్లు ఇచ్చారా మీరు.. పదేళ్లు విద్వాంసం చేశారు.. స్వేచ్ఛ లేకుండా చేశారు మీరు అంటూ కేటీఆర్ పై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడితే ఎలా.. ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడితే.. నువ్వు కూడా ఆటే పో.. ఇక్కడ ఎందుకు మరి అంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!