Cyber Criminals: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. టాస్క్ ల పేరుతో 11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
Cyber Criminals: సంగారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి అధిక డబ్బు ఆశ చూపి రూ.41.29 లక్షలు కేటుగాళ్ళు కాజేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ లో ఉండే ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. దీంతో నిజమని నమ్మిన ఉద్యోగి మెసేజ్ కు రిప్లై ఇచ్చాడు. అంతే కేటుగాళ్లు ఈ ఉద్యోకి తలపై టోకరాపై పెట్టేశారు. పక్కా ఉద్యోగం వస్తుందంటూ నమ్మించారు. అయితే పార్ట్ టైం జాబ్ వస్తుందని భావించిన ఉద్యోగి వాళ్లు చెప్పిన ప్రాసెన్ ఫాలో అయ్యాడు. ఉద్యోగం కోసం విడతల వారిగా రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తరువాత వారికి కాల్ చేసిన నో రెన్పాన్స్ దీంతో మోసపోయానని భావించిన ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం వస్తుందని మోసపోయానని, తన డబ్బులు తనకు ఇప్పించాలని కన్నీరుమున్నీరయ్యాడు. ఇక మరోవైపు పటాన్ చెరులో ఉండే మరో ఉద్యోగి నుంచి రూ. 11.29 లక్షలను టాస్క్ ల పేరుతో సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఆలస్యంగా గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read also: MLC Jeevan Reddy: అనవసర ప్రాజెక్ట్ లు కట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు..
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
ఇక తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఎన్.రాజేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే.. నగరంలోని ఎల్లారెడ్డి గూడలో విజయ రాజరాజేశ్వరి కనస్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఓ కార్యాలయాన్ని తెరిచాడు. అంతేకాకుండా.. తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక శాతం రాబడి, వడ్డీలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేశాడు. దీంతో.. తన స్నేహితులు, బంధువుల ద్వారా ఎంతోమందిని బుట్టలో వేసుకున్నాడు. ఇక రియల్ ఎస్టేట్ సంస్థ వీఆర్ఆర్ గ్రూప్స్లో నగదు డిపాజిట్, పెట్టుబడితో ప్రతి ఏడాది 24 నుంచి 27శాతం వడ్డీ ఇస్తామని నమ్మించాడు. కాగా.. తమ రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా తాము నిర్మించే హోటళ్లతో లాభాల పంట పడుతుందంటూ బుట్టలో పడేశాడు. ఇక.. మొదట్లో కొందరికి నెలవారీ వడ్డీలు ఇవ్వడంతో ఇదంతా నిజమనే వారు నమ్మారు. దీంతో.. సుమారు 100 మంది ఇతడి మాటలు నమ్మి భారీఎత్తున అతడి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇక నగరానికి చెందిన 29 మంది బాధితులు రూ.23 కోట్ల మేర ఆ సంస్థలో డిపాజిట్ చేశారు. అయితే.. ఈ నెల 2న కూకట్పల్లికి చెందిన ఐటీ నిపుణురాలు ఇచ్చిన ఫిర్యాదుతో వీఆర్ఆర్ సంస్థ, డైరెక్టర్లు రాజేశ్, వాణి, వినోద్రావు, రవి, బ్రహ్మయ్య, ఎం.రవి, ఏ.కృష్ణ, తాడిమెటీరావు తదితరులుపై నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!