Depression: డిప్రెషన్ పెరిగితే ఇలా చేయండి.. తప్పకుండా రిలీఫ్ దొరుకుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Depression: ప్రస్తుతం మానవుడిది ఉరుకుల పరుగుల జీవితమైంది. టైంకు తిండి, నిద్ర లేదు. తిన్న కాసింతైన నాణ్యమైనది దొరుకుతుందా అంటే అదీ లేదు… అన్నింటా కాలుష్యం. తీరా గాలిపీల్చుకుందామనుకున్న పెరుగుతున్న పరిశ్రమలతో వాయుకాలుష్యం తీవ్రమైంది. దీంతో పీల్చే ప్రాణవాయువు విషతుల్యంగా మారుతోంది. దీని ఎఫెక్ట్ నేరుగా మన శరీరంపై పడుతోంది. కారణంగా శరీరంతో పాటు మెదడు దెబ్బతింటుందని పరిశోధనల్లో రుజువైంది. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల మనుషుల్లో డిప్రెషన్ పెరుగుతోందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది.
వాయు కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ చాలా మందికి ప్రత్యక్షంగా ఈ విషయం అర్ధం కాకపోవచ్చు. వాటిని క్షుణ్నంగా విశ్లేషిస్తేనే వాస్తవం మనకు తెలుస్తుంది. వాయు కాలుష్యం వల్ల ప్రజల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. కాలుష్యం మనిషిలో డిప్రెషన్ పెంచుతుంది. వారిలో మానసిక సమస్యలను ప్రేరేపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా మంది ఈ సమస్యలను కొట్టిపారేస్తారు. దీంతో ప్రమాదం మరింత పెరుగుతోంది.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
Read Also: WPL 2023: ఢిల్లీ టీమ్కు షెఫాలీ.. మరి అప్పట్లో కోహ్లీని ఎందుకు తీసుకోలే!
కలుషిత ప్రాంతాల్లో నివసించే వ్యక్తులకు డిప్రెషన్ ప్రమాదం ఎక్కువగా ఉందని JAMA నెట్వర్క్ ఓపెన్ నివేదికలో తెలిపింది. దీర్ఘకాలికంగా కాలుష్య ప్రాంతాల్లో నివసించే వారిలో డిప్రెషన్ లెవల్ పెరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. మెడికేర్ ద్వారా తమ ఆరోగ్య బీమాను పొందిన 8.9 మిలియన్ల మంది వ్యక్తుల సమాచారాన్ని పరిశీలించారు. 2005 నుండి 2016 వరకు అధ్యయన కాలంలో 1.52 మిలియన్ల కంటే ఎక్కువ మంది డిప్రెషన్తో బాధపడుతున్నారని కనుగొన్నారు. కానీ ఈ సంఖ్య తక్కువ అని, ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Bandi Sanjay: కేసీఆర్ ఇంకా ఈటల ఆయన మనిషి అనుకుంటున్నారు
వాయు కాలుష్యం పెరగడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ కేసులు కూడా పెరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. దీని వల్ల చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వాయు కాలుష్యం వల్ల డిమెన్షియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2019 సంవత్సరపు ప్రపంచ సమీక్షలో, వాయు కాలుష్యం మన శరీరంలోని ప్రతి భాగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని వెల్లడైంది. వాయు కాలుష్య ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులపై మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు విషపూరితమైన గాలి ఊపిరితిత్తులకు గుండెకు హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్ తగ్గించుకునేందుకు సాధ్యమైనంత వరకు ప్రశాంత వాతావరణంలో ఉండేదుకు ప్రయత్నించండి. సాయంత్రాలు చల్లని నీడినిచ్చే చెట్లకింద రిలీఫ్ అవ్వండి. యోగాలాంటివి ప్రాక్టీస్ చేయండి.
తాజావార్తలు
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!