Delhi University : డీయూకు చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్ లో మార్పు.. సావర్కర్పై కొత్త అధ్యాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi University : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్లో అనేక మార్పులు చేశారు. యూనివర్శిటీ ఐదవ సెమిస్టర్లో హిందుత్వ సిద్ధాంతకర్త డిడి సావర్కర్పై ఒక అధ్యాయాన్ని చేర్చింది. అదే సమయంలో మహాత్ముడికి సంబంధించిన అధ్యాయం ఏడవ సెమిస్టర్కు మార్చబడింది. ఢిల్లీ యూనివర్శిటీ సిలబస్లో వీడీ సావర్కర్పై అధ్యాయాన్ని చేర్చడం ఇదే తొలిసారి. యూనివర్సిటీ పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు శుక్రవారం అకడమిక్ కౌన్సిల్ (ఏసీ) సమావేశం జరిగింది. ఈ రెండు ప్రధాన మార్పులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో సభ్యుడు అలోక్ రంజన్ మాట్లాడుతూ.. ఇంతకుముందు సావర్కర్ సిలబస్లో భాగం కాదని, మహాత్మా గాంధీకి ఐదవ సెమిస్టర్లో బోధించారని చెప్పారు.
Read Also:New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
కొత్త మార్పు తర్వాత సావర్కర్ను ఐదో సెమిస్టర్లో, అంబేద్కర్ను ఆరో సెమిస్టర్లో, ఏడో సెమిస్టర్లో మహాత్మాగాంధీకి సంబంధించిన అధ్యాయాన్ని చేర్చినట్లు ఆయన చెప్పారు. సావర్కర్ అధ్యాయంను చేర్చుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే మహాత్మాగాంధీకి సంబంధించిన అధ్యాయం గురించి బోధించకూడదని రంజన్ అన్నారు. బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి కవి ముహమ్మద్ ఇక్బాల్ని తొలగించినట్లు శనివారం నాడు వార్తలు వచ్చాయి. మహమ్మద్ ఇక్బాల్ తొలగింపుపై, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పునాది వేసిన పాఠ్యాంశాల్లో అతనికి స్థానం లేదని డియు వైస్-ఛాన్సలర్ యోగేష్ సింగ్ అన్నారు.
Read Also:NTR Ghat: ఆయన కొడుకుగా పుట్టడం అదృష్టం.. ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ నివాళి
ఈ సమావేశంలో ఇక్బాల్ను సిలబస్ నుంచి తొలగించడంపై పలువురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా’ కవిత ద్వారా ఇక్బాల్ భారతదేశానికి సాటిలేని సేవలందించారని సభ్యులు పేర్కొన్నారు. సమావేశంలో ఇక్బాల్ను తొలగిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయంపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో విసి సింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మరింత బోధించాలని ఉద్ఘాటించారు. అంబేద్కర్ గురించి మరింత ఎక్కువ సమాచారం జోడించాలని అధ్యాపకులను కోరారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!